Begin typing your search above and press return to search.

ఆసియా కుబేరుడిగా గౌతం అదానీ.... అంబానీని మించిన సంపద‌

ఆసియాలో అత్యంత కుబేరుడిగా మ‌రోసార అదానీ గ్రూపు సంస్థ‌ల అధిప‌తి గౌతం అదానీ నిలిచారు.

By:  Tupaki Desk   |   3 Jun 2024 10:11 AM GMT
ఆసియా కుబేరుడిగా గౌతం అదానీ.... అంబానీని మించిన సంపద‌
X

ఆసియాలో అత్యంత కుబేరుడిగా మ‌రోసార అదానీ గ్రూపు సంస్థ‌ల అధిప‌తి గౌతం అదానీ నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా గౌతం అదానీ నిలిచారు. శనివారం నాటికి అదానీ 111 బిలియన్ డాలర్ల నికర విలువతో ఆసియాలో కెల్లా అత్యంత ధ‌న‌వంతులైన వారి జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు, అంబానీ సంప‌ద 109 బిలియన్ డాల‌ర్లు కావ‌డం గ‌మ‌నార్హం.

దాదాపు ఐదు నెలల తర్వాత అదానీ... అంబానీని అధిగమించారు. అంబానీ ప్రస్తుతం $109 బిలియన్ల నికర విలువతో 12వ స్థానంలో ఉన్నారు. అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ $5.45 బిలియన్ల నికర విలువను క‌ల‌ప‌గా ఆయ‌న సంద‌ప 111 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరింది. ఇక‌, అంబానీ $76.2 మిలియన్ల లాభం పొందిన‌ట్టు బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది. గ‌డిచిన ఆర్థిక సంవ‌త్స‌రంతో పోల్చుకుంటే.. అదానీ $26.8 బిలియన్ల నికర లాభాన్ని సంపాయించారు.

జనవరి 2023లో హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ వాల్యుయేషన్‌లో క్రాష్ కారణంగా RIL ఛైర్మన్ అంబానీ ఆయ‌న‌ను అధిగమించారు. గ్రూప్ స్టాక్స్‌లో ఇటీవల జరిగిన ర్యాలీ కారణంగా అదానీ ఆసియాలో అత్యంత సంపన్న ర్యాంక్‌ను తిరిగి పొందారు. మే 31న, అన్ని అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పుంజుకున్నాయి. తరువాతి దశాబ్దంలో $90 బిలియన్ల మూలధన వ్యయంతో సహా గ్రూప్ దూకుడు, విస్తరణ ప్రణాళికలను హైలైట్ చేస్తూ జెఫరీస్ చేసిన నివేదికలో రోజులో 14 శాతం పెరిగిన‌ట్టు పేర్కొన్నారు.

అదానీ గ్రూప్ స్టాక్స్ పెట్టుబడిదారుల సంపదలో రూ. 1.23 లక్షల కోట్ల వరకు పెరిగిన‌ట్టు తాజా నివేదిక వెల్ల‌డించింది. ఇంట్రాడే ప్రాతిపదికన వాటి మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 17.94 లక్షల కోట్లకు చేరుకుంది. ముగింపు సమయానికి మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.84,064 కోట్లతో రూ.17.51 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది.

హిండెన్‌బర్గ్ నివేదికలోని ఆరోపణలపై విచారణకు ఒక ప్యానెల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత 2023 క్యాలెండర్ ఇయర్ అదానీ గ్రూప్‌కు చాలా సవాలుగా ఉంది. $110 బిలియన్ల విలువతో ప్రపంచంలోనే మూడవ అత్యంత సంపన్న వ్యక్తి అయిన అదానీ, నివేదిక రాకముందే గ్రూప్ షేర్లు అమ్ముడయిన తర్వాత అతని సంపద 34 శాతం పెరిగింది.

తర్వాత అదానీ గ్రూప్‌పై దర్యాప్తును ముగించాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇకపై విచారణలు అవసరం లేదని పేర్కొంది. గత వారం, అదానీ గ్రూప్ భవిష్యత్తు గురించి తన ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. "ముందుకు వెళ్లే మార్గం అసాధారణమైన అవకాశాలతో సుగమం చేయబడింది. అదానీ గ్రూప్ గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉందని నేను మీకు చెబుతున్నాను`` అన్నారు.

తాజా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రస్తుతం $207 బిలియన్ల నికర విలువతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా నిలిచారు. ఆ తర్వాత ఎలోన్ మస్క్, సెఫ్ బెజోస్ మొత్తం సంపదతో వరుసగా $203 బిలియన్, $199 బిలియన్లు క‌లిగి ఉన్నారు.