Begin typing your search above and press return to search.

70 ఏళ్లు ఆ పైబడిన వారికి కూడా ఆయుష్మాన్ భారత్

ఇది ఆరోగ్య భీమా పధకం. ఒక విధంగా ఓల్డ్ ఏజ్ పీపుల్ కి ఇది రక్షణ కవచంగా పనిచేస్తుంది.

By:  Tupaki Desk   |   11 Sep 2024 5:59 PM GMT
70 ఏళ్లు ఆ పైబడిన వారికి కూడా ఆయుష్మాన్ భారత్
X

కేంద్రం వయో వృద్ధులకు ఒక శుభ వార్త వినిపించింది. ఏడు పదులు నిండిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ పధకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించింది. ఇది ఆరోగ్య భీమా పధకం. ఒక విధంగా ఓల్డ్ ఏజ్ పీపుల్ కి ఇది రక్షణ కవచంగా పనిచేస్తుంది.

దేశంలోని ఈ విధంగా 70 ఏళ్ళు నిండిన వారందరికీ ఈ పధకం వర్తింపచేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న కీలక నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలియచేశారు.

ఇది గొప్ప మానవతావాదంతో తీసుకున్న నిర్ణయం అని ఆయన అన్నారు. దేశంలో చూస్తే డెబ్బై ఏళ్ళు నిండిన వారు ఆరు కోట్ల దాకా ఉన్నారు. వారందరికీ ఈ పధకం వర్తిస్తుంది. ఇక 70 ఏళ్ళు నిండితే చాలు వారి ఆర్ధిక పరిస్థితులు ఇతర వ్యవహారాలతో సంబంధం లేకుండా వారికి అయిదు లక్షల దాకా ఆరొగ్య భీమా వర్తింపచేయడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం.

దీని వల్ల కార్పోరేట్ ఆసుపత్రులలో సైతం వారు ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. ఇదిలా ఉంటే ఈ పధకం కింద ఇప్పటికే ఉన్న కుటుంబాలలో సీనియర్ సిటిజన్లకు మరో అయిదు లక్షల బీమా వర్తింపచేయనున్నట్లుగా కేంద్రం చెబుతోంది.

ఇక ఆయుష్మాన్ పధకాన్ని కేంద్రం 2018లో సెప్టెంబర్ లో ప్రారంభించింది. అంటే ఇప్పటికి ఆరేళ్ళు అన్న మాట. ఈ పధకం కింద ప్రతీ పేద కుటుంబంలో పేదలకు ఆయుష్మాన్ కార్డుని అందిస్తారు. ఆ కార్డుతో వారు ఆసుపత్రిలో చేరినపుడు అయిదు లక్షల దాకా వైద్యం ఉచితంగా అందుతుంది.

ఇపుడు కేంద్ర కేబినెట్ నిర్ణయం మేరకు 70 ఏళ్లు ఆ పైబడిన వారికి కూడా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం వర్తింపజేయాలని నిర్ణయించారు. అంటే ఇది వయో వృద్ధులకు ఒక వరంగా మారుతోంది అని చెప్పాలి. మొత్తానికి కేంద్ర మంత్రి వర్గం సీనియర్ సిటిజన్ల మీద కరుణ చూపిందనే అంటునారు. దీని వల్ల వారంతా ఎవరి ఆసరా సాయం లేకుండా జీవిత చరమాంకంలో తమకు వచ్చే జబ్బులకు అయిదు లక్షల రూపాయల దాకా ఫ్రీగా మంచి వైద్యం చేయించుకోగలరు అని అంటున్నారు.