Begin typing your search above and press return to search.

రాయలసీమకు బాబు గిఫ్ట్ హైకోర్టు బెంచ్ !

మాకు ఫ్యూచర్ గ్యారంటీ ఏంటి అంటే శ్రీభాగ్ ఒప్పందం అని పెద్ద మనుషులు కోస్తా సీమ ప్రాంతాల వారు కలసి కుదుర్చుకున్నారు.

By:  Tupaki Desk   |   24 Sep 2024 3:39 AM GMT
రాయలసీమకు బాబు గిఫ్ట్ హైకోర్టు బెంచ్ !
X

రాయలసీమ గడచిన ఆరు దశాబ్దాలుగా అన్యాయంతో ఆక్రోశిస్తోంది. మేము రాము మొర్రో అని చెప్పినా వినకుండా కోస్తా ప్రాంతాల వారు తమతో పాటు ఉమ్మడి మద్రాస్ స్టేట్ నుంచి రాయలసీమ జిల్లాలను ఆంధ్ర రాష్ట్రం వైపు తీసుకుని వచ్చారు.

అయితే మాకు మద్రాసు స్టేట్ తోనే సుఖం అని చెప్పారు రాయలసీమ పెద్దలు. అలా కాదు మనమంతా ఒక్కటీ అని నచ్చచెప్పారు. మాకు ఫ్యూచర్ గ్యారంటీ ఏంటి అంటే శ్రీభాగ్ ఒప్పందం అని పెద్ద మనుషులు కోస్తా సీమ ప్రాంతాల వారు కలసి కుదుర్చుకున్నారు.

దాని ప్రకారం రాయలసేమకు రాజధాని ఇస్తే కోస్తాకు హైకోర్టు అని అనుకున్నారు. అలాగే రాజధాని కోస్తాకు వెళ్తే సీమకు హైకోర్టు అని ఒడంబడిక కుదిరింది. అలా 1953లో ఏపీ స్టేట్ ఏర్పడింది. అది పదకొండు జిల్లాలుగా. ఆ తరువాత కోస్తాలో మరో రెండు జిల్లాలు వచ్చాయి కానీ సీఎం అలాగే పాత జిల్లాలతో ఉంది.

జగన్ సీఎం అయ్యాక సీమలో నాలుగు జిల్లాలు డబుల్ అయ్యాయి. అది వేరే విషయం. తొలి నాళ్ళలో కర్నూల్ రాజధానిగా సీమ వైభవం వెలిగిపోయింది. కానీ ఆ కేవలం మూడేళ్ళ ముచ్చట అయింది. విశాలాంధ్రా అని 1956లో హైదరాబాద్ స్టేట్ ని కలుపుకుని ఏర్పాటు అయ్యాక రాజధాని భాగ్యనగరానికి తరలిపోయింది.

దాంతో సీమకు ఏమీ మిగలలేదు. ఇక 2014లో చూస్తే మళ్లీ ఏపీ విభజన జరిగింది. పూర్వం రూపంలో స్టేట్ ఉంది కాబట్టి తమకు రాజధాని అయినా హైకోర్టు అయినా శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం ఇవ్వాలని గత పదేళ్ళుగా సీమవాసులు కోరుతూనే ఉన్నారు.

టీడీపీ తొలి టెర్మ్ లో ఏమీ కాలేదు. జగన్ అయితే హైకోర్టుతో న్యాయ రాజధాని చేస్తామని అన్నారు. కానీ ఆచరణలో అది అడుగు ముందుకు పడలేదు. అయితే ఇన్నాళ్ళకు టీడీపీ కూటమి సీమకు అంతో ఇంతో న్యాయం చేసేందుకు సిద్ధపడుతోంది.

సీమకు హైకోర్టు బెంచ్ ని గిఫ్ట్ గా ఇవ్వాలని బాబు డిసైడ్ అయ్యారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టేందుకు తొందరలోనే మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం చేస్తామని చెప్పారు. ఆ మీదట ఆ ప్రతిపాదనను కేంద్రానికి పంపుతామని ప్రకటించారు.

కేంద్రంలోని బీజేపీ ఎటూ కూటమిలో ఉంది. దాంతో పాటు హైకోర్టు బెంచ్ అన్నది బీజేపీ 2019 ఎన్నికలో సీమకు ఇచ్చిన హామీలలో ఉంది. మొత్తానికి అయితే హైకోర్టు బెంచ్ అయితే సీమకు గ్యారంటీగా రాబోతోంది అని భావించవచ్చు. మరి దీనితో వారు తృప్తి పడతారా ఫుల్ హ్యాపీయేనా అంటే ఏమో ఇవన్నీ జరిగాక మాత్రమే ఆలోచించాల్సి ఉంది. అప్పటివరకూ సీమ వాసుల మనోగతం ఏమిటి అన్నది ఎవరికీ తెలియదు అనే చెప్పాలి.