Begin typing your search above and press return to search.

సెంటిమెంట్ రిపీట్: బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కు నీతూ అంబానీ!

ఐపీఎల్ సెంటిమెంట్ ను ఫాలో అయ్యారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతూ అంబానీ

By:  Tupaki Desk   |   28 March 2024 4:30 AM GMT
సెంటిమెంట్ రిపీట్: బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కు నీతూ అంబానీ!
X

ఐపీఎల్ సెంటిమెంట్ ను ఫాలో అయ్యారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతూ అంబానీ. ఐపీఎల్ టోర్నీలో భాగంగా తమకు చెందిన ముంబయి ఇండియన్ క్రికెట్ జట్టు హైదరాబాద్ లో ఆడే సందర్భంగా జట్టుతో పాటు నీతూ అంబానీ కూడా రావటం తెలిసిందే. అలా వచ్చిన సందర్భంలో ఆమె బల్కంపేట (అమీర్ పేట)లోని ప్రముఖ ఎల్లమ్మ, పోచమ్మ ఆలయాన్ని సందర్శించుకుంటారు. ప్రత్యేక పూజలు చేయిస్తారు.

తాజాగా మరోసారి తన సెంటిమెంట్ ను ఫాలో అయ్యారు నీతూ అంబానీ. బుధవారం రాత్రి ఆమె బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కు వచ్చారు. ప్రత్యేక పూజలు చేసేందుకు టెంపుల్ కు వచ్చిన ఆమెకు ఆలయ ఈవో .. ఛైర్మన్లు స్వాగతం పలికారు. సుమారు పదిహేను నిమిషాల పాటు ఆలయంలో గడిపిన నీతూ అంబానీ.. అద్దాల మండపాన్ని సందర్శించారు.

ఐపీఎల్ లో ముంబయి ఇండియన్ జట్టుకు యజమానిగా వ్యవహరిస్తున్న నీతూ అంబానీకి.. తమ జట్టు హైదరాబాద్ లో ఆడేందుకు వచ్చే ప్రతిసారి బల్కంపేట టెంపుల్ కు వచ్చి అమ్మవారికి పూజలు చేయిస్తుంటారు. ఆ సెంటిమెంట్ ను ఆమ మరోసారి రిపీట్ చేశారని చెప్పాలి.