Begin typing your search above and press return to search.

ఉత్తరం ఈడ్చికొట్టింది .. దక్షిణం దంచికొట్టింది !

గత ఎన్నికల్లో బీజేపీతో విభేదించి ఒంటరిగా పోటీ చేసిన తెలుగుదేశం ఈ సారి మాత్రం ఎన్డీయే కూటమిలో చేరిపోయింది.

By:  Tupaki Desk   |   5 Jun 2024 6:15 AM GMT
ఉత్తరం ఈడ్చికొట్టింది .. దక్షిణం దంచికొట్టింది !
X

ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, హర్యానా వంటి ఉత్తరాది రాష్ట్రాలలో చావుదెబ్బ తిన్న బీజేపీ దాని మిత్రపక్షాలు దక్షిణ భారతం ఆదరించడంతో అధికార పీఠాన్ని అందుకోగలుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, హర్యానా తదితర రాష్ట్రాల్లో 60 నుంచి 70 సీట్ల వరకూ కోల్పోయిన ఎన్డీయే పక్షాలు దక్షిణాదిన 50 సీట్ల వరకూ గెలుచుకోగలిగాయి.

గత ఎన్నికల్లో బీజేపీతో విభేదించి ఒంటరిగా పోటీ చేసిన తెలుగుదేశం ఈ సారి మాత్రం ఎన్డీయే కూటమిలో చేరిపోయింది. ఆ పార్టీ అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో 16 సీట్లను గెలుచుకొని ఎన్డీయేకు ఊపిరిపోసింది. టీడీపీ మద్దతుతో బీజేపీ సైతం ఏపీలో మూడు సీట్లను గెలుచుకోగలిగింది.

ఇక తెలంగాణలో బీజేపీ తన సీట్లను రెట్టింపు చేసుకోగలిగింది. గత ఎన్నికల్లో నాలుగు సీట్లను గెలుచుకున్న కమలనాథులు ఈ ఎన్నికల్లో ఎనిమిది సీట్లను గెలుపొందారు. ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 14 శాతం ఓట్లను మాత్రమే పొందిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల నాటికి 35 శాతం ఓట్లను సాధించడం గమనార్హం.

మరో దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో కూడా కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆ రాష్ట్రంలోని మొత్తం 28 సీట్లకుగాను బీజేపీ 17 స్థానాలను గెలుచుకోగా, దాని మిత్రపక్షం జేడీఎస్‌ రెండింటిలో గెలుపొందింది. బీజేపీ మొదటిసారిగా కేరళలో విజయం సాధించడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఈసారి సినీ నటుడు సురేశ్‌గోపీ బీజేపీ తరఫున గెలుపొంది ఆ పార్టీకి మొదటి సీటును అందించారు.