Begin typing your search above and press return to search.

అల్లును కెలికి.. ప‌వ‌న్‌కు మంట పెడుతున్నారే!

జ‌న‌సేన నాయ‌కులకు -అల్లు అర్జున్‌కు మ‌ధ్య వివాదం ర‌గులుతూనే ఉంది. రోజు రోజుకు పెద్ద‌ది కూడా అవుతోంది.

By:  Tupaki Desk   |   28 Aug 2024 4:38 AM GMT
అల్లును కెలికి.. ప‌వ‌న్‌కు మంట పెడుతున్నారే!
X

జ‌న‌సేన నాయ‌కులకు -అల్లు అర్జున్‌కు మ‌ధ్య వివాదం ర‌గులుతూనే ఉంది. రోజు రోజుకు పెద్ద‌ది కూడా అవుతోంది. నాకు న‌చ్చిన వారికి, న‌న్ను అభిమానించేవారికి అండ‌గా ఉంటానంటూ.. ఇటీవ‌ల అల్లు అర్జున్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీనిపై విమ‌ర్శ‌లు.. ప్ర‌సంశ‌లు కూడా వ‌చ్చాయి. అయితే.. విమ‌ర్శ‌లు చేస్తున్న‌వారిలో జ‌న‌సేన నాయ‌కులు ఉండడంతో ఈ వ్య‌వ‌హా రం.. అటు తిరిగి ఇటు తిరిగి పార్టీ అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ మెడ‌కు చుట్టుకుంటున్నాయి. తాజాగా అల్లు అర్జున్ వ్య‌వ‌హారానికి మ‌రింత పెట్రోల్ పోసిన‌ట్టు వ్య‌వ‌హ‌రించారు.. జ‌న‌సేన పార్టీ తాడేప‌ల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌.

అల్లుపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. `మెగా అభిమాని` అనే కార్డు పెట్టుకుని వివాదాన్ని మ‌రింత ర‌గిలించారు. ``అల్లు అర్జున్ ఏమైనా పుడింగా. అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు. ఉన్నది ఒక షామియానా కంపెనీ.`` అని తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు. అంతేకాదు.. చిరంజీవి, పవన్, రామ్ చరణ్ ఫ్యాన్స్... అల్లు అర్జున్ కు మద్ద‌తుగా ఉన్నార‌ని.. లేక‌పోతే.. ఆయ‌న‌కు ఫ్యాను.. ఫ్యాన్స్ కూడా లేర‌ని ఎద్దేవా చేశారు. ``మెగా ఫ్యాన్స్ లేకపోతే అల్లు అర్జున్ ఎవరు" అని విమ‌ర్శ‌లు గుప్పించారు.

అల్లు అర్జున్ 2009లో త‌న తండ్రినే గెలిపించుకోలేక పోయాడ‌ని.. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీకి ప్ర‌చారం చేసినా.. ఆయ‌న కూడా ఓడిపోయాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. అల్లు వ్య‌వ‌హారం.. ఇప్ప‌ట్లో రాజ‌కీయాల‌ను వ‌దిలేలా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనివ‌ల్ల పార్టీ ప‌రిస్థితి ఇబ్బందుల్లో ప‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మెగా ఫ్యామిలీని అన‌వ‌స‌రంగా రోడ్డుకు లాగి.. ప‌వ‌న్‌ను మ‌రింత ఇబ్బంది పెట్ట‌డమేన‌ని చెబుతున్నారు. పైగా జ‌న‌సేన కీల‌క నాయ‌కుడు బొలిశెట్టి ఇలా వ్యాఖ్యానించ‌డం ద్వారా.. పార్టీ ప‌రిస్థితి ఎలా మారుతుందో ఆయ‌న ఊహించ‌లేక పోతున్నారా? అనే చ‌ర్చ‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.