Begin typing your search above and press return to search.

వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యల కేసు... విచారణలో లేటెస్ట్ అప్ డేట్ ఇదే!

వారాహి యాత్రలో వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Sep 2023 4:54 AM GMT
వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యల కేసు... విచారణలో లేటెస్ట్ అప్ డేట్ ఇదే!
X

వారాహి యాత్రలో వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఓ మహిళా వాలంటీర్ కోర్టును ఆశ్రయించారు.. పవన్ చేసిన వ్యాఖ్యలు మనోవేదనకు గురి చేశాయని.. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం విజయవాడ కోర్టు ఆ విచారణను వాయిదా వేసింది.

అవును... వాలంటీర్లపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యల కేసు విచారణను విజయవాడ సిటీ సివిల్ కోర్టు ఈ నెల 26కి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మహిళా వాలంటీర్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసిన న్యాయస్థానం... తాజాగా సాక్ష్యుల స్టేట్ మెంట్స్ నీ రికార్డ్ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.

కాగా వారహియాత్రలో భాగంగా ఏలూరు సభలో మైకందుకున్న పవన్ కల్యాణ్... ఏపీ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో మహిళల మిస్సింగ్ కు వాలంటీర్లు కారణమని.. ఆ విషయాన్ని సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు తనకు చెప్పాయంటూ సంచలన ఆరోపణలు చేశారు.

గ్రామాల్లో ఉండే వాలంటీర్లు ప్రతి గ్రామంలో ఎవరు ఎవరి మనిషి? ఏ కుటుంబంలో ఎంత మంది ఉంటున్నారు? ఆడపిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నారా? వారిలో వితంతువులు ఉన్నారా? ఒంటరిగా ఉంటున్న మహిళలు ఎవరు? అనే విషయాలను సేకరించి ఆ సమాచారాన్ని సంఘవిద్రోహ శక్తులకు చేరవేయడంతో పాటు వాళ్లను ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

ఇదే విషయంపై కేంద్ర నిఘా వర్గాలు తనను హెచ్చరించాయని, ఆ విషయాన్ని ప్రజలకు చెప్పమన్నాయని చెప్పుకొచ్చిన పవన్ కల్యాణ్.... దీని వెనుక వైపీసీ పెద్దల హస్తం కూడా ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలతో మనస్థాపం చెందిన ఒక మహిళా వాలంటీర్ పవన్ కల్యాణ్ పై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.