Begin typing your search above and press return to search.

"గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది".. పవన్ ప్రభంజనంపై సెలబ్రెటీల రియాక్షన్ వైరల్!

ఇదే ట్రెండ్ కొనసాగితే జనసేనానికి భారీ మెజారిటీ దక్కడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

By:  Tupaki Desk   |   4 Jun 2024 9:27 AM GMT
గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది.. పవన్  ప్రభంజనంపై సెలబ్రెటీల రియాక్షన్  వైరల్!
X

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధిపతి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భారీ విజయం దిశగా దూసుకెళుతున్నారు. ఈ సమయంలో పిఠాపురం నుంచి బరిలోకి దిగిన ఆయన తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి వంగా గీతపై ఇప్పటికే సుమారు 50 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారని తెలుస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే జనసేనానికి భారీ మెజారిటీ దక్కడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు చోట్లా ఓడిపోయినా పవన్ ఇప్పుడు భారీ మెజారిటీతో దూసుకెళుతుండడంతో జనసేన శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్, కూటమికి సపోర్టు చేస్తూ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఆన్ లైన్ వేదికగా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా హీరో నితిన్, దర్శకుడు హరీష్ శంకర్ ట్వీట్ చేశారు.

అవును... పిఠాపురంలో పవన్ గెలుపుపై సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా... పవన్ తో తాను తెరకెక్కిస్తోన్న "ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా"లోని "గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది" అని పవన్ చెప్పిన డైలాగ్ వీడియోను షేర్ చేశారు.

ఇదే సమయంలో... రాబోయే రోజుల్లో పవన్ కల్యాణ్ చేతిలో ఆంధ్రప్రదేశ్ సేఫ్ గా ఉంటుందని ట్వీట్ చేశారు హీరో సాయి ధరం తేజ్! ఇదే సమయంలో... "చెప్పాడు... చేసాడు. మనల్ని ఎవడ్రా ఆపేది!!" అని మరో ట్వీట్ చేసి తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.

"నెత్తురు మరిగిన ఆకలిగొన్న చీతా" అంటూ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేయగా... "ఇప్పుడు గర్వంగా ఆయన్ని పిలుస్తాం.. పవర్ స్టార్ అని" అని నాగవంశీ ట్వీట్ చేశారు. ఇలా పలువురు సెలబ్రెటీలు పిఠాపురంలో పవన్ గెలుపుపై హర్షం వ్యక్తం చేస్తుండగా... జనసైనికుల సెలబ్రేషన్స్ మాత్రం పీక్స్ కి చేరాయి.