Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ విధానం ర‌ద్దు.. వారికి చంద్ర‌బాబు గుడ్ న్యూస్‌!

గ‌త వైసీపీ విధానాల‌ను ర‌ద్దు చేస్తూ.. ప‌లు విష‌యాల్లో చంద్ర‌బాబు స‌ర్కారు నిర్ణ‌యాలు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 July 2024 3:44 AM GMT
జ‌గ‌న్ విధానం ర‌ద్దు.. వారికి చంద్ర‌బాబు గుడ్ న్యూస్‌!
X

గ‌త వైసీపీ విధానాల‌ను ర‌ద్దు చేస్తూ.. ప‌లు విష‌యాల్లో చంద్ర‌బాబు స‌ర్కారు నిర్ణ‌యాలు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లులో ఉన్న వైఎస్సార్ పంటల బీమా ప‌థ‌కాన్ని ర‌ద్దు చేస్తూ.. ప్ర‌క‌ట‌న జారీ చేశారు. దీని వ‌ల్ల మెజారిటీ రైతుల‌కు మేలు జ‌ర‌గ‌లేద‌ని.. చంద్ర‌బాబు స‌ర్కారు భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఈ ప‌థకాన్ని ర‌ద్దు చేయ‌డంతోపాటు.. 2014-19 మ‌ధ్య అమ‌లైన రైతుల ప‌థ‌కాల‌ను తీసుకురావాల‌ని నిర్ణ‌యించా రు. ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

వైసీపీ హ‌యాంలో అనుస‌రించిన‌ విధానాలవల్ల వ్యవసాయం భారంగా మారిందన్న‌ది ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఆలోచ‌న‌గా ఉంది. ఈ నేప‌థ్యంలోనే ప్రభుత్వ రాయితీలు, విధానాల ద్వారా సాగు ఖర్చు తగ్గించాలని నిర్ణ‌యించుకుంది. 2014-19 మ‌ధ్య జ‌రిగిన‌ పాలనలో అమ‌లైన కీల‌క వ్య‌వ‌సాయ ప‌థ‌కం `జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్` విధానాన్ని ప్రవేశపెట్ట‌నున్నారు. త‌ద్వారా రైతుల‌కు మ‌రిన్ని మేళ్లు జ‌రుగుతాయ‌న్నది ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వ ఆలోచ‌న‌గా ఉంది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌ల్లో ఉన్న ప‌థ‌కాల‌ను ర‌ద్దు చేయ‌నున్నారు.

జ‌గ‌న్ స‌ర్కారు రైతుల పంటల బీమా ప్రీమియంను స్వ‌యంగా చెల్లించింది. ఈ-క్రాప్ ద్వారా పంటలను నమోదు చేసి ప్రీమియం చెల్లిస్తూ వచ్చారు. ఈ విషయంలో తప్పులు జరిగాయని, సాంకేతిక కారణాలతో చాలా మంది రైతులకు బీమా అందలేదనేది టీడీపీ అప్ప‌ట్లోనే ఆరోప‌ణ‌లు చేసింది. ఈ నేపథ్యంలో పాత పంటల బీమా విధానాన్ని మ‌రోసారి తీసుకురావాల‌ని స‌ర్కారు త‌ల‌పెట్టింది. త‌ద్వారా.. అధునాత సాగుకు ప్రోత్సాహం ఇవ్వాల‌న్న స‌ర్కారు ల‌క్ష్యం నెర‌వేర‌నుంద‌ని అధికారులు చెబుతున్నారు.

కొత్త విధానంలో ఏం జ‌రుగుతుంది?

+ రైతుల‌కు పంట‌ల‌పై మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పిస్తారు.

+ డ్రోన్లతో పురుగుమందులను పిచికారీ చేసే విధానంపై అధ్యయనం చేసి రైతులకు వాటిపై అవగాహన కల్పించనున్నారు.

+ రైతుల భాగస్వామ్యంతోనే పంటల బీమా విధానాన్ని కొనసాగించనున్నారు.

+ ఐఏఎస్ అధికారులు కూడా పొలాలకు వెళ్లి రైతులతో నేరుగా మాట్లాడి.. వారి క‌ష్ట సుఖాలు పంచుకోనున్నారు.

+ 2014-19 మధ్య రైతుల‌కు వ‌రంగా మారిన సాయిల్ టెస్ట్‌(మట్టి పరీక్షలు) మళ్లీ కొనసాగించనున్నారు.

+ రాయితీలద్వారా డ్రిప్పుల‌ను రైతుల‌కు చేరువ చేయ‌నున్నారు.