Begin typing your search above and press return to search.

జగన్ టీమ్ కి చెవిరెడ్డి ఖరీదైన దసరా బహుమతులు?

కట్ చేస్తే... ఇప్పుడు పరిస్థితులు తారుమారైన పరిస్థితి! జగన్ గత వైభవాన్ని పోగోట్టుకోవడంతో ఆ పార్టీలో పండగ వాతావారణం కనిపించడం లేదని అంటున్నారు.

By:  Tupaki Desk   |   12 Oct 2024 2:30 PM GMT
జగన్  టీమ్  కి చెవిరెడ్డి ఖరీదైన దసరా బహుమతులు?
X

గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి జరుపున్న దసరా పండగను.. ఈ ఏడాది ప్రతిపక్షంలో ఉండి జరుపుకుంటున్నారు వైసీపీ నేతలు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలొని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యాలయాల్లో.. ప్రధానంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సందడి ఒక రేంజ్ లో ఉండేది!

అయితే.. ఇప్పుడు పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్న పరిస్థితి! ఇక ఈ విజయదశమి పండుగ వేళ క్యాంపు కార్యాలయం నుంచి ఆకర్షణీయమైన బహుమతులు అందేవని చెబుతుంటారు. ఇదే సమయంలో.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా ప్రతినిధులకు కూడా అప్పటి అధికార పార్టీ ఖరీదైన బహుమతులే ఇచ్చినట్లు వచ్చినట్లు చెబుతుంటారు!

కట్ చేస్తే... ఇప్పుడు పరిస్థితులు తారుమారైన పరిస్థితి! జగన్ గత వైభవాన్ని పోగోట్టుకోవడంతో ఆ పార్టీలో పండగ వాతావారణం కనిపించడం లేదని అంటున్నారు. ఇక క్యాంపు కార్యాలయం నుంచి బహుమతుల ప్రస్థావన కూడా లేదని చెబుతున్నారు. ఈ సమయంలో ఆ లోటును ఎంతో కొంత పూడ్చడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రంగంలోకి దిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

అవును... ప్రస్తుతం పార్టీ అధికారంలో లేకపోవడంతో తాడేపల్లి పార్టీ నాయకులు, ఇతర సిబ్బందిలో పండగ సందడి కనిపించడం లేదని అంటున్న వేళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. "నేనున్నాను" అంటూ రంగంలోకి దిగారని.. దసరా సందర్భంగా పలువురు వైసీపీ నేతలకు భారీ కానుకలు ఇచ్చారని తెలుస్తోంది.

ఇందులో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి మొదలు చాలా మంది నాయకులకు, కార్యాలయంలోని అధికారులకు చెవిరెడ్డి దసరా బహుమతులు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా యాపిల్ ఐఫోన్ 16ప్రో మొబైల్ ఫోన్లను అందించారని అంటున్నారు. ఈ ఒక్కొక్క ఫోన్ ఖరీదు రూ.1.60 లక్షలకు పైమాటే!

ఇదే క్రమంలో ఇతర సిబ్బంది కూడా ఇతర ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో... దసరా పండగ వేళ వైసీపీ కేంద్ర కార్యాలయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాట్ టాపిక్ గా మారారని సమాచారం!!