Begin typing your search above and press return to search.

గరం లేపిన గంటా అత్యుత్సాహం !

ప్రతిపక్షంలో ఐదేళ్లు వైసీపీ అరాచకాలను ప్రశ్నించలేదు.

By:  Tupaki Desk   |   18 Jun 2024 5:43 AM GMT
గరం లేపిన గంటా అత్యుత్సాహం !
X

వివాదాస్పద రుషికొండ ప్యాలెస్ విషయంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఎవరిని అడిగి రిషికొండ ప్యాలెస్ తాళాలు తీశారు ? ప్రభుత్వం ఈ విషయంలో ఒక నిర్ణయానికి రాక ముందే ఈ అత్యుత్సాహం ఎందుకు ? కేవలం ప్రచారం కోసం మీడియాను వెంటబెట్టుకుని హడావుడి చేయాల్సినంత అవసరం ఏమిటి ? అని ఆరా తీసినట్లు తెలుస్తుంది.

అయితే దీని వెనక పెద్ద కథే ఉంది. ఎమ్మెల్యేగా గత ఐదేళ్లుగా రుషికొండ ప్యాలెస్ నిర్మాణం మీద ఒక్కసారి కూడా గంటా శ్రీనివాసరావు నోరు మెదపలేదు. ప్రతిపక్షంలో ఐదేళ్లు వైసీపీ అరాచకాలను ప్రశ్నించలేదు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు రుషికొండ పర్యటనకు వస్తే గంటా ఆయనతో పాటు వెళ్లలేదు. మరి ఇప్పుడు ఎందుకు హడావుడి అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

రుషికొండ పర్యాటక కాటేజీలను ధ్వంసం చేసి ప్యాలెస్ నిర్మించడంపై జనసేన కార్పోరేటర్ పీతల మూర్తియాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణ బాబు అందులో ఇంప్లీడ్ అయ్యాడు. మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామక్రిష్ణంరాజు సుప్రీంకోర్టు సూచనలతో ఇంప్లీడ్ అయ్యాడు. కానీ గంటా మాత్రం ఎన్నడూ దాని గురించి మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో కలిసి ఈ ప్యాలెస్ వ్యవహారం బహిర్గతం చేయాలని భావించారని, కానీ వారి ఆలోచనను గంటా అత్యుత్సాహం పక్కదారి పట్టించిందని అంటున్నారు.