Begin typing your search above and press return to search.

ఓర్నీ దర్శన్.. హత్య అరాచకంపై పోలీసులకు కీలక క్లూ

ఈ క్రమంలో పలు అంశాల్ని దర్శన్ స్వయంగా వెల్లడించినట్లు సమాచారం.

By:  Tupaki Desk   |   20 Jun 2024 5:03 AM GMT
ఓర్నీ దర్శన్.. హత్య అరాచకంపై పోలీసులకు కీలక క్లూ
X

ప్రముఖ కన్నడ హీరో దర్శన్ దురాగతాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అభిమాని హత్య కేసులో అతగాడి పాత్రను కళ్లకు కట్టినట్లుగా చెప్పే ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. కన్నడ నటితో అతడికున్న వివాహేతర సంబంధం.. దీని కారణంగా అతడి వైవాహిక జీవితంలో తలెత్తున్న సమస్యలపై అతగాడి వీరాభిమాని రేణుకాస్వామి స్పందించి.. పవిత్రను ఫోటోలు.. వీడియోలతో వేధింపులకు గురి చేయటం.. ఈ విషయాన్ని తన ప్రియుడు దర్శన్ కు పవిత్రకు చెప్పటం.. దీంతో తన అభిమానిని దారుణంగా హత్య చేయటం లాంటి అంశాలు తెలిసిందే.

తన వీరాభిమానిని కిడ్నాప్ చేయించి.. బెంగళూరు మహానగరానికి తీసుకొచ్చి.. అతడ్ని తీవ్రంగా వేధింపులకు గురి చేయటంతో పాటు.. హింసకు గురి చేసి దారుణంగా హత్య చేయటం తెలిసిందే. హత్యకు ముందు శాఖాహారి అయిన రేణుకా స్వామికి బలవంతంగా నాన్ వెజ్ బిర్యానీ తినిపించటం.. అందుకు ససేమిరా అన్న అతగాడిని తీవ్రంగా హింసించిన వైనం పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

ఇదిలా ఉండగా.. తాజాగా అభిమాని హత్య కేసులో తన పాత్రను దర్శన్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లుగా పోలీసు వర్గాలు వెల్లడించినట్లుగా కన్నడ మీడియా చెబుతోంది. హత్య నేరాన్ని దర్శన్ స్వయంగా ఒప్పుకోవటమే కాదు.. దీనికి సంబంధించిన కీలక అంశాల్ని బయటపెట్టినట్లుగా చెబుతున్నారు. దర్శన్ ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతడ్ని విచారిస్తున్నారు. ఈ క్రమంలో పలు అంశాల్ని దర్శన్ స్వయంగా వెల్లడించినట్లు సమాచారం.

హత్య అనంతరం రేణుకా స్వామి డెడ్ బాడీని ఎవరికీ తెలియకుండా మాయం చేయాలంటూ మరో నిందితుడు ప్రదేశ్ కు రూ.30 లక్షలు ఇచ్చినట్లుగా దర్శన్ అంగీకరించారన్న విషయం బయటకు వచ్చింది. ఈ సందర్భంగా తన పేరు ఎక్కడా బయటకు రాకూడదన్న ఆర్డర్ వేసినట్లుగా సమాచారం. ఈ కేసులో దర్శన్ తో పాటు 17 మంది నిందితుల్ని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. హత్యకు ముందు రేణుకా స్వామిని చిత్ర హింసలకు గురి చేయటంతో పాటు.. కరెంటుషాక్ కు గురి చేసిన వైనం అతడి పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. రానున్న రోజుల్లో ఈ వ్యవహారంపై మరెన్ని సంచలన అంశాలు బయటకు వస్తాయో చూడాలి.