Begin typing your search above and press return to search.

దివ్వెల మాధురి కారు యాక్సిడెంట్... ఇంతలోనే బిగ్ ట్విస్ట్!

ఈ సమయంలో ఈ వ్యవహారంలో సెంటర్ పాయింట్ గా ఉన్న మాధురి కారు ఘోర ప్రమాదానికి గురైంది.

By:  Tupaki Desk   |   11 Aug 2024 11:18 AM GMT
దివ్వెల మాధురి కారు యాక్సిడెంట్... ఇంతలోనే బిగ్  ట్విస్ట్!
X

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారంలో రోజు రోజుకీ కొత్త కొత్త ట్విస్ట్ లు, జలక్కులు, లీకులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ మేటర్ వ్యవహారం తీవ్ర సంచలనంగా మరింది. దీనికి తోడు తాజాగా దివ్వెల మాధురి కారుకి ప్రమాదం జరిగింది. అయితే అది ప్రమాదం కాదంటూ ఆమె ట్విస్ట్ ఇచ్చింది.


అవును... దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారం మీడియాకు ఎక్కి రచ్చ రచ్చగా మారిన అనంతరం పలు ట్విస్ట్ లు, వాట్సప్ మెసేజ్ ల లీకులు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో ఈ వ్యవహారంలో సెంటర్ పాయింట్ గా ఉన్న మాధురి కారు ఘోర ప్రమాదానికి గురైంది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద ఆమె కారు ప్రమదానికి గురైంది.

ఆ టోల్ వద్ద ఆగి ఉన్న కారును ఈమె నడుపుతున్న కారు ఢీకొట్టింది. దీంతో... ఈ ప్రమాదంలో దివ్వెల మాధురికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో ఆమెను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె టెక్కలి నుంచి పలాస వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రమాదంలో బిగ్ ట్విస్ట్!:

అయితే... ఈ ప్రమాదంపై దివ్వెల మాధురి స్పందించారు. ఈ సందర్భంగా షాకింగ్ విషయం వెల్లడించారు. ఇందులో భాగంగా... తనకు జరిగింది రోడ్డు ప్రమాదం కాదని, తానే కావాలని మరో కారును ఢికొట్టినట్లు ఆమె తెలిపారు. తనపైనా, తన పిల్లలపైనా సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ తట్టుకోలేక.. వాణి ఆరోపణలు భరించలేక ఇలా చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా తనకు ట్రీట్ మెంట్ చేయొద్దని డాక్టర్లతో చెప్పినట్లు ఆమె వెల్లడించారు. దీంతో... దువ్వాడ ఫ్యామిలీ మేటర్ మరో మలుపు తిరిగినట్లయ్యిందని అంటున్నారు. ఈ వ్యవహారంపై దువ్వాడ శ్రీనివాస్, వాణి ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి.