Begin typing your search above and press return to search.

దువ్వాడ ఉత్సవం...జంటగా హుషారుగా !

వైసీపీ ఎమ్మెల్సీ శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన కీలక నేత దువ్వాడ శ్రీనివాస్ కో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   7 Oct 2024 2:15 PM GMT
దువ్వాడ ఉత్సవం...జంటగా హుషారుగా !
X

వైసీపీ ఎమ్మెల్సీ శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన కీలక నేత దువ్వాడ శ్రీనివాస్ కో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఆయన తన అనుచరురాలు వైసీపీ మహిళా నేత మాధురితో కలసి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యారు. ఏడుకొండల స్వామిని ఈ జంట దర్శించుకున్నారు. వీరి వెంట టెక్కలికి చెందిన వైసీపీ నేతలు కూడా ఉన్నారు

ఈ సందర్భంగా మీడియాకు ఎదురుపడి వారి ముందు చిరునవ్వులు చిందిస్తూ దువ్వాడ శ్రీనివాస్ కనిపించారు. దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ రెండు నెలల క్రితం ఎలా సాగిందో అందరికీ తెలిసిందే. తన భార్య వాణి కుమార్తెతో ఆయన విభేదించిన తీరుతో పాటు ఆయన టెక్కలి హైవే మీద కట్టిన కొత్త ఇల్లు తమదే అంటూ వారు రచ్చ చేయడంతో కొన్నాళ్ళ పాటు మీడియాకు అదే వార్త అయింది

అయితే మాధురికి తాను రెండు కోట్ల రూపాయలు బాకీ పడ్డాను అని ఆ ఇంటికి ఆమె పేరున శ్రీనివాస్ రిజిస్ట్రేషన్ చేయించడంతో ఆ ఇల్లు ఆమె పరం అయింది. దాంతో ఆ వివాదం ఆగిపోయింది. మరో వైపు చూస్తే తన భార్యకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా ఆయన మీడియా ముందే ప్రకటించారు. సో ఆ విషయం పక్కన పెడితే వైసీపీ మహిళా నేత మాధురితో కలసి ఆయన తాజాగా మీడియా ముందు కనిపించడంతో ఆయన సంచలనంగా మారారు.

రానున్న రోజులలో కీలక వార్త ఏదైనా చెబుతారా అన్న చర్చ కూడా వస్తోంది. ఇక వైసీపీ నేత దువ్వాడ డేరింగ్ లీడర్ అని మహిళా నాయకురాలు మాధురి చెబుతూ ఉంటారు. ఆయనని హీరోగా పెట్టి ఆమె వాలంటీర్ అన్న సినిమా ఇటీవల తీశారు అని అంటున్నారు.

ఇలా దువ్వాడ శ్రీనివాస్ మాధురితో కలసి బయటకు రావడం ఆయన భార్య కుమార్తెలు ఈ ఇష్యూ విషయంలో ఒక లాజికల్ ఎండింగ్ కోసం చూస్తున్నట్లుగా సైలెంట్ కావడం జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ ఈ ఇష్యూలో ఓపెన్ అయ్యారని అందుకే మీడియా ముందుకు వచ్చారని అంటున్నారు.

మరో వైపు చూస్తే వైసీపీ అధినాయకత్వం కూడా దువ్వాడ శ్రీనివాస్ విషయంలో కఠినంగా వ్యవహరించడం లేదు. ఆయనను టెక్కలి ఇన్చార్జి పదవి నుంచి మాత్రమే తప్పించింది. ఆయన ఎమ్మెల్సీ పదవి అలాగే ఉంది. ఆయన ఈ మధ్య వైసీపీ నిర్వహించిన జిల్లా స్థాయి పార్టీ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. దాంతో రానున్న రోజులలో ఆయన పార్టీ పరంగా మళ్లీ కీలకం కానున్నారు అని అంటున్నారు.

ఏది ఏమైనా దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ గా దూకుడు కలిగిన నాయకుడు. ఆయన ఇటీవల కాలంలో వ్యక్తిగత వివాదాల్లో పడి కాస్తా పొలిటికల్ గా వెనకబడ్డారు ఇపుడు మరీ సరికొత్త ఉత్సాహంతో కనిపిస్తూ మీడియాకు వచ్చారు. రానున్న రోజులలో ఆయన యధా ప్రకారం వైసీపీ తరఫున తన సత్తాను చూపుతారు అని అభిమానులు అంటున్నారు. ఏది ఏమైనా ఆరు పదుల వయసులో ఉన్నా నవ యువకుడిగా దువ్వాడ కనిపిస్తున్నారు అని ఆయన ఫ్యాన్స్ అంటోంది. ఆయనలో ఉత్సాహం హుషారుని వారు ఆస్వాదిస్తున్నారు.