Begin typing your search above and press return to search.

దువ్వాడ కుటుంబ కథా చిత్రమ్ లో ఇది మామూలు ట్విస్ట్ కాదు!!

ఓ సమయంలో ఆయన వారిపై దాడికి ప్రయత్నించినట్లు పలు దృశ్యాలు తెరపైకి వచ్చాయనే ఆరోపణలూ ఉన్నాయి.

By:  Tupaki Desk   |   17 Aug 2024 9:30 PM GMT
దువ్వాడ కుటుంబ కథా చిత్రమ్ లో ఇది మామూలు ట్విస్ట్ కాదు!!
X

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న హాట్ టాపిక్కుల్లో గత కొన్ని రోజులుగా లైవ్ లో ఉన్న అంశం ఏదంటే దువ్వాడ కుటుంబ కథా చిత్రమ్ అని కొంతమంది ఠక్కున చెబుతున్న పరిస్థితి. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై ఆయన భార్య వాణి, కుమార్తె ఎన్నో ఆరోపణలు చేశారు. ఓ సమయంలో ఆయన వారిపై దాడికి ప్రయత్నించినట్లు పలు దృశ్యాలు తెరపైకి వచ్చాయనే ఆరోపణలూ ఉన్నాయి.

ఇక ఈ వ్యవహారంలో సెంటర్ పాయింట్ గా చెబుతున్న మాధురి వ్యవహారమూ పీక్స్ కి చేరింది. తనను ట్రోల్స్ చేస్తున్నారని.. తనపై వాణి దారుణమైన, దుర్మార్గమైన ఆరోపణలు చేస్తున్నారని.. అందువల్ల తాను మనస్థాపానికి గురైనట్లు చెబుతూ ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారు! ఇక తన భార్యపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఆమె రాజకీయ ఎదుగుదల చూడలేకే ఈ ఆరోపణలు అని ఆమె భర్త మహేష్ వెర్షన్.

ఈ నేపథ్యంలో ఆమెపై తనకు పూర్తి నమ్మకం ఉందని చెబుతూ.. ఆమె దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్న విషయంపై ఆయన "నో కామెంట్" అంటూ కూడా రియాక్ట్ అయ్యారు. తన భార్యకు రాజకీయాలంటే ఇష్టం ఉండటంతోనే తాను అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఇక ఆమెకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేవని, ఆమెకు తన జీతం మొత్తం అమెరికా నుంచి ఎప్పటికప్పుడు పంపించేస్తానని ఆయన తెలిపారు.

మరోపక్క తనను మాధురి ట్రాప్ చేయడానికి ఛాన్స్ లేదని.. తన వద్ద ఏమీ లేదని.. తనకున్న ఆస్తులు, ఇళ్లు, డబ్బులు భార్య, పిల్లలకు రాసిచ్చేసినట్లు దువ్వాడ వెల్లడించారు. తనపై భార్య, కూతురు చేస్తున్న ఆరోపణలు సత్యదూరాలని చెప్పుకొచ్చారు. ఇక తనదొక విచిత్రమైన కథ అని.. ఆ కథకు విడాకులే ముగింపని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం తెరపైకి వచ్చింది.

అవును... దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న వేళ, వరుసగా కేసులు తెరపైకి వస్తున్న వేళ తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా తమకు ఆస్తులు అక్కర్లేదని, రాజకీయాలూ వద్దని.. తాము ఎప్పటిలాగా అంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటే చాలని.. ఇదే తమ డిమాండ్ అని దువ్వాడ శ్రీనివాస్ భార్య తాజాగా ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

ఇదే క్రమంలో... ఏ వ్యాపారం చేసినా సక్సెస్ అయితే తన పేరున రాయాలని ఆమె అంటుందని శ్రీను ఆరోపిస్తున్నారని ఇది తప్పని తెలిపారు. ఆయన ప్రస్తుతం పూర్తిగా రాంగ్ వెర్షన్ లో ఉన్నారని.. గత 29 సంవత్సరాల వైవాహిక జీవితంలో తాను ఈ విషయం గ్రహించలేకపోయానని.. తన స్వార్థం తాను చూసుకోలేకపోయాయని ఆమె చెప్పుకొచ్చారు. ఫైనల్ గా తన భర్త, పిల్లలు కలిసి ఉండటమే తనకు కావాలని తెలిపారు.

ఇదే సమయంలో తాను ఏదైనా వ్యాపారం చేసి అది ఫెయిల్ అయితే ఆమె వదిలేస్తుందని.. బిజినెస్ సక్సెస్ అయితే అది తనపేరును రాయమంటుందని అంటున్నారని.. అసలు తనకు అలాంటి ఆలోచన ఉంటే డబ్బులు పెట్టడమే మానేస్తాను కదా అని వాణి ప్రశ్నిస్తున్నారు. ఇదే క్రమంలో.. ఆయన ఎటు వెళ్లినా, ఎలా తిరుగుకున్నా తనకు అనవసరం అని.. మరో కూతురు పెళ్లికి ఉందని.. సమాజం కోసం అయినా కలిసి ఒకే ఇంట్లో ఉండాలన్నదే తన కోరికని ఆమె తెలిపారు.

ఇక ఆమెకు శ్రీనివాస్ నుంచి విడాకుల నోటీసులు ఏమీ అందలేదని.. ఇదే సమయంలో తాను శ్రీనుకి ఎలాంటి నోటీసులూ ఇవ్వదలచుకోలేదని అన్నారు. దీంతో.. ఇప్పుడు ఈ విషయం దువ్వాడ శ్రీను వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ గా మారిందనే కామెంట్లు వినిపించడానికి కారణమవుతుందని అంటున్నారు. మరి వాణి చేస్తున్న ఈ వ్యాఖ్యలపై శ్రీనివాస్ పాజిటివ్ గా స్పందిస్తారా.. లేక, విడాకులకే స్టిక్ ఆన్ అయ్యి ఉంటారా అనేది వేచి చూడాలి.