Begin typing your search above and press return to search.

రాజమండ్రిలో యాంకర్ పై దాడి... అసలేం జరిగింది?

అవును... ఈవెంట్ లకు యాంకర్ గా పనిచేసే కావ్య శ్రీ అనే మహిళపై దాడి జరిగింది.

By:  Tupaki Desk   |   14 Oct 2024 9:28 AM GMT
రాజమండ్రిలో యాంకర్  పై దాడి... అసలేం జరిగింది?
X

రాజమండ్రిలో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఓ యాంకర్ పైనా, ఆమె తండ్రిపైనా దాడి చేసి గాయపరిచారని అంటున్నారు. ఈ దాడిలో ఆమె ముఖంపై గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే... ఆమెకు మరో వ్యక్తికి ఉన్న ఆర్థికపరమైన అంశాలే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... ఈవెంట్ లకు యాంకర్ గా పనిచేసే కావ్య శ్రీ అనే మహిళపై దాడి జరిగింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలుస్తోంది. ఈమె ఓ వ్యక్తికి అప్పు ఇవ్వడం.. అది ఎన్ని సార్లు అడిగినా అతడు స్పందించకపోవడం.. తీరా ఇంటికి వెళ్లి అడిగితే.. తిరిగి భౌతికంగా దాడిచేయడం జరిగిందని అంటున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... యాంకర్ కావ్య శ్రీ కి రాజమండ్రికి చెందిన అభిలాష్ అనే వ్యక్తితో స్నేహం ఉందట. ఈ క్రమంలో తాను చేసే వ్యాపారం కోసం అతడు కావ్య శ్రీ వద్ద రూ.3 లక్షలు అప్పుగా తీసుకున్నాడు! 2021లో ఆమె అతడికి ఈ మొత్తన్ని క్యాష్ రూపంలోనే ఇచ్చారట. అయితే... నాటి నుంచి ఈ అప్పుపై వడ్డీ ఊసు లేదు, అసలు టాపిక్కు లేదని అంటున్నారు.

అయితే ఈ విషయాన్ని అభిలాష్ తండ్రి శ్రీనివాస్ తో కావ్య శ్రీ పలుమార్లు చెప్పిందంట. అయినప్పటికీ ఏళ్లు గడుస్తున్నాయి కానీ.. అప్పు తీర్చడం లేదంట. తాను ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వడం లేదని కావ్య శ్రీ అంటున్నారు. అయితే.. కావ్యశ్రీ సొంత ఊరు విజయవాడ కాగా.. ఆమె హైదరాబాద్ లోనే ఉంటుంది.

అయితే.. ఆదివారం కోనసీమ జిల్లాలోని ఓ ఈవెంట్ కోసం వచ్చిన ఆమె.. తన తండ్రితో కలిసి శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో తన దగ్గర అప్పు తీసుకున్న అభిలాష్ ఆ సమయానికి అక్కడ లేడు. దీంతో... అభిలాష్ తీసుకున్న డబ్బును తనకు తిరిగి ఇవ్వాలని కావ్య శ్రీ, ఆమె తండ్రి కలిసి శ్రీనివాస్ ను అడిగారంట.

దీంతో... సీరియస్ అయిన శ్రీనివాస్.. డబ్బులు అడిగేందుకు నా ఇంటికే వస్తారా అంటూ తండ్రీకుమార్తెల మీద దాడికి పాల్పడ్డాడని అంటున్నారు. ఈ సమయంలో తండ్రితో పాటు కావ్య శ్రీ కి గాయాలయ్యాయని చెబుతున్నారు. దీంతో... తమపై జరిగిన దాడిపై స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు కావ్య శ్రీ, ఆమె తండ్రి!

ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడిన శ్రీనివాస్ అనే వ్యక్తి మాజీ ఎంపీ మార్గాని భరత్ కు అనుచరుడు, సన్నిహితుడు అని చెబుతున్నారు! ఈ నేపథ్యంలో... స్థానికంగా ఈ విషయం వైరల్ గా మారింది!