Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ మొత్తం ఒకేసారి హైదరాబాద్ కు ఇదే మొదటిసారి

హైదరాబాద్ శివారులో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశానికి సోనియా హైదరాబాద్ కు వచ్చారు.

By:  Tupaki Desk   |   17 Sep 2023 4:38 AM GMT
ఫ్యామిలీ మొత్తం ఒకేసారి హైదరాబాద్ కు ఇదే మొదటిసారి
X

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మరోసారి హైదరాబాద్ కు వచ్చారు. అయితే.. ఇప్పటివరకు ఆమె వచ్చిన సందర్భాలకు.. తాజా సందర్భానికి కాస్తంత తేడా ఉంది. ఒకప్పుడు యావత్ దేశ రాజకీయాల్ని తన కనుసైగతో శాసించిన ఆమె.. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి. అయితే.. రానున్న రోజుల్లో పరిస్థితుల్ని మార్చేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ శివారులో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశానికి సోనియా హైదరాబాద్ కు వచ్చారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. దివంగత మహానేత వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న 2008లో శంషాబాద్ ఎయిర్ పోర్టును తన చేతుల మీదనే ప్రారంభించారు. గడిచిన పదిహేనేళ్లలో ఎప్పుడూ కూడా ఈ ఎయిర్ పోర్టుకు కుటుంబం మొత్తం కలిసి వచ్చిన సందర్భమే లేదు. అందుకు భిన్నంగా శనివారం సీన్ చోటు చేసుకుంది. ఒకే విమానంలో తొలిసారి కుటుంబ సభ్యులు మొత్తం కలిసి హైదరాబాద్ కు వచ్చారు.

సోనియాగాంధీ.. రాహుల్ గాంధీ.. ప్రియాంక వాద్రా కలిసి కట్టుగా ఒకే ఫ్లైట్ లో వచ్చిన సందర్భంగా వారికి స్వాగతం పలికేందుకు వచ్చిన నేతలతో ఎయిర్ పోర్టు మొత్తం సందడిగా మారింది. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన నేతలతోనే తెలంగాణ రాజకీయాల గురించి సోనియా.. రాహుల్.. ప్రియాంకలు కాసేపు మాట్లాడారు. ఏమైనా.. ఇప్పటివరకు హైదరాబాద్ కు సోనియా వచ్చిన టూర్ కు తాజా ప్రయాణం కాస్తంత భిన్నమైందని మాత్రం చెప్పక తప్పదు.