Begin typing your search above and press return to search.

భార్యతో కలిపి 42 మంది మహిళలను చంపాడు!

తాజాగా ఇతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   22 July 2024 3:48 AM GMT
భార్యతో కలిపి 42 మంది మహిళలను చంపాడు!
X

ఒకప్పుడు కన్నడలో వచ్చిన "ఉత్కర్ష", తమిళ్ లో తెరకెక్కిన "మన్మథ" సినిమాల తరహాలో అన్నట్లుగా అమ్మాయిలకు వల వేయడం, లొంగదీసుకోవడం, అనంతరం వారిని అత్యంత కిరాతకంగా చంపడం డ్యూటీగా పెట్టుకున్నాడు ఓ వ్యక్తి! ఈ క్రమంలో ఇప్పటికే పదుల సంఖ్యలో మహిళలను హత్య చేసి చెత్తకుప్పలో పడేశాడు. తాజాగా ఇతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడు చేసిన హత్యల లిస్ట్ చెబుతున్నారు.

అవును... మహిళలకు వల వేసి, లొంగతీసుకుని.. అనంతరం వారిని దారుణంగా చంపి, చెత్తబుట్టలో పడేస్తున్న ఓ నిందితుడు తాజాగా పోలీసులకు చిక్కాడు. ఎట్టకేలకు నిందితుడు నేరాన్ని అంగీకరించాడని అంటున్నారు. ఇతడి గురించి ఒక్క లైన్ లో చెబుతున్న పోలీసులు... ‘మనిషి ప్రాణం అంటే ఏమాత్రం విలువ లేని వ్యక్తి’ అని స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా అతడు చేసిన దారుణాలను వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కెన్యాలోని నైరూబీలో రెండేళ్ల నుంచి వరుసగా మహిళలను హత్య చేసి పోలీస్ స్టేషన్ కు సమీపంలోని చెత్తబుట్టలో పారేస్తున్నాడు 33 ఏళ్ల కొల్లిన్స్ జమైసీ కాలుషా. ఇతడిని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని విచారించగా... దాదాపు 42 మంది మహిళలను హత్యచేసినట్లు అంగీకరించాడు.

ఇటీవల నైరూబీలోని ముకూరు మురికివాడ చెత్తకుప్పలో తొమ్మిది మంది మహిళల మృతదేహాలను ఇటీవల పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో.. ఈ ప్రదేశానికి 100 మీటర్ల దూరంలోనే శిథిలమైన గదిలో ఇందితుడు కాలుషా అద్దెకు ఉండేవాడు. అధికారులకు అనుమానం వచ్చి అతడి ఇంటిని తనిఖీ చేయగా.. నైలాన్ సంచులు, భారీ ఎత్తున టేపు, పరిశ్రమల్లో వాడే రబ్బరు గ్లౌజులు కనిపించాయి.

మృతదేహాలను అక్కడ నుంచి తరలించడానికి వీటిని వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఇతడు 2022 నుంచి జూలై 2024లోపు సుమారు 42 మంది మహిళలకు వలవేసి, లొంగదీసుకుని అనంతరం హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వారి మృతదేహాలను చిధ్రం చేసి సమీపంలోని భారీ డంపింగ్ యార్డులో పాడేశాడని అన్నారు. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏమిటంటే... అతడు చంపినవారిలో తన భార్య కూడా ఉండటం!!