Begin typing your search above and press return to search.

బుల్లితెర నుంచి గ్లామన్ మిస్సెస్ ఇండియా.. శభాష్ అనిపించుకున్న విశాఖ అమ్మాయి

అయితే ఇందులో ఓ తెలుగు అమ్మాయి తన సత్తా చాటుతూ విజేతగా నిలిచింది.

By:  Tupaki Desk   |   5 Oct 2024 9:30 PM GMT
బుల్లితెర నుంచి గ్లామన్ మిస్సెస్ ఇండియా.. శభాష్ అనిపించుకున్న విశాఖ అమ్మాయి
X

ప్రపంచంలో జరిగే అందాల పోటీలకి కొదవలేదు. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ ఇలా ఎన్నో పేర్లతో ఈ అందాల పోటీలు ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉంటాయి . అలాంటి పోటీ ఒకటి మలేషియాలో కూడా జరిగింది. అయితే ఇందులో ఓ తెలుగు అమ్మాయి తన సత్తా చాటుతూ విజేతగా నిలిచింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ అమ్మాయి ఎవరో ? ఆ పోటీ ఏమిటో? తెలుసుకుందాం పదండి..

మలేషియాలో సెప్టెంబర్ చివరి వారంలో గ్లామన్ మిస్సెస్ ఇండియా 2024 పోటీలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ పోటీల కోసం సుమారు 300 మంది హాజరయ్యారు. అందరినీ తన అందంతో వెనక్కి నెట్టేసి తెలుగు అమ్మాయి హేమలత రెడ్డి ఈ పోటీలలో విజేతగా నిలిచి గ్లామన్ మిస్సెస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆమెకు ఘన స్వాగతం తో పాటు విశాఖలో సత్కారం కూడా జరిగింది.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. విదేశాలలో చత్తాచాటి బ్యూటీ కాంపిటీషన్లో గెలిచిన విశాఖ అమ్మాయి హేమలత రెడ్డిని అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. హేమలత రెడ్డి లాంటి అమ్మాయిలు ఎందరికో స్ఫూర్తి అంటూ ఆమె జీవితంలో మరెన్నో టైటిల్స్ గెలిచి విశాఖ పేరు నిలపాలి అని అభినందించారు.

హేమలత రెడ్డి బుల్లితెర ప్రేక్షకుల తో పాటు వెండితెర ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు. ఆమె హ్యాపీ డేస్ అనే సీరియల్ లో లీడ్రోలో నటించారు. అంతేకాదు జగపతిబాబు ప్రవరాఖ్యుడు చిత్రంలో కూడా ఆమె నటించారు. నిన్నే చూస్తూ అనే సినిమాకి హీరోయిన్ గా, నిర్మాతగా వ్యవహరించారు. అన్ని రంగాలలో తనకు టాలెంట్ ఉంది అని నిరూపించుకుంటూ ముందుకు సాగుతోంది ఈ మల్టీ టాలెంటెడ్ లేడీ.గ్లామాన్ మిసెస్ ఇండియా టైటిల్ ని గెలుచుకున్న హేమలతా రెడ్డి త్వరలో పారిస్ ఫ్యాషన్ డీక్ కు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు.