Begin typing your search above and press return to search.

భార్యను చంపేసి ఇసుకలో పూడ్చేసిన భర్త... కారణం అదేనట!

ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్న సంఘటనలు ఎన్నో తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   13 July 2024 4:26 AM GMT
భార్యను చంపేసి ఇసుకలో పూడ్చేసిన భర్త... కారణం అదేనట!
X

ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్న సంఘటనలు ఎన్నో తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ తరహా వ్యవహారాల వల్ల ఛిన్నాభిన్నం అయిపోతున్న కుటుంబాలు ఎన్నో నిత్యం ఏదో మూల దర్శనమిస్తుంటాయి. ఈ సమయంలో జరిగే హత్యలు, అనంతరం అనాదలుగా మారుతున్న పిల్లలు! తాజాగా ప్రొద్దుటూరులో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.

అవును... కొన్ని రోజులుగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న తన భార్యను ఎన్నిసార్లు మందలించినా వినడం లేదు. దీంతో పార్క్ కు వెళ్దామంటూ భార్యను తీసుకుని వెళ్లిన ఆ భార్త.. గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆ కంప చెట్లలో గొయ్యి తీసి ఇసుకలో పూడ్చేశాడు. ఆపై పోలీసుల ఎదుట లొంగిపోయిన ఘటన శుక్రవారం రాత్రి ప్రొద్దుటూరులో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అమృతనగర్ కు చెందిన అన్వర్ బాషా.. మైలవరం మండలం దొడియం గ్రామానికి చెందిన రేష్మా లకు పదేళ్ల కిందట పెళ్లైంది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో అన్వర్ భాషా ప్రొక్లెయిన్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో.. కొన్ని రోజులుగా తన భార్య రేష్మా... మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటం భర్తకు తెలిసింది. దీంతో విషయం గ్రహించిన భర్త కన్ఫాం చేసుకుని.. పలుమార్లు ఆమెను మందలించాడు. అయినప్పటికీ ఆమెలో మార్పు రాలేదు. విడాకులివ్వాలని కోరినా ఆమె అందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో పదిరోజుల కిందట వీరిమధ్య పెద్ద గొడవే జరిగింది.

దీంతో... అలిగిన రేష్మ, ఈశ్వర్ రెడ్డి నగర్ లోని బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఈశ్వర్ రెడ్డి నగర్ కు వెళ్లిన అన్వర్ బాషా ఆమెను పార్క్ కి రమ్మని తీసుకెళ్లాడు. ఈ క్రమంలో కొద్ది సేపు ఆ పార్కులోనే గడిపిన అనంతరం.. పార్కు ఎదురుగా ఉన్న కంప చెట్లలోకి తీసుకెళ్లి, ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అక్కడే గొయ్యి తీసి పూడ్చి పెట్టేశాడు.

అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పాడు బాషా. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇసుకలో పూడ్చిపెట్టిన రేష్మ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్థానికంగా ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.