Begin typing your search above and press return to search.

అనుమానంతో భార్యను చంపి ఎంత పెద్ద స్కెచ్ వేశాడంటే?

దీనికి తోడు అనుమానం రోగంతో వేధింపులకు గురి చేసేవాడు. కొడుకు పుట్టిన ఏడాది వరకు చూసేందుకు వెళ్లలేదు.

By:  Tupaki Desk   |   25 May 2024 5:10 AM GMT
అనుమానంతో భార్యను చంపి ఎంత పెద్ద స్కెచ్ వేశాడంటే?
X

ఇద్దరు చదువుకున్న వారే. ఇద్దరూ ఐటీ ఉద్యోగులు. అయినప్పటిని అనుమానం రోగంతో భార్యతో గొడవలు పెట్టుకునే భర్త.. చివరకు ఆమెను కడతేర్చిన షాకింగ్ సీన్ బాచుపల్లిలో చోటు చేసుకుంది. భార్యను చంపేసి.. దాన్ని సూసైడ్ గా మార్చేందుకు స్కెచ్ వేసినప్పటికి సాధ్యం కాలేదు. దీంతో.. ఫ్రెండ్ ఇంటికి వెళ్లి మరింత జాగ్రత్తగా ప్లానింగ్ చేయాలనుకున్నా సాధ్యం కాలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ఉదంతంలో దుర్మార్గపు భర్తను అరెస్టు చేసిన పోలీసులు.. ఈ ఉదంతాన్ని గుట్టుగా ఉంచటం.. కొద్ది రోజుల తర్వాత బయటకు వచ్చిన వైనంసై కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగిందంటే..

ఏపీలోని ప్రకాశం జిల్లాలోని గొట్లగట్టుకు చెందిన 29 ఏళ్ల మధులను అదే జిల్లాలోని దర్శికి చెందిన 31 ఏళ్ల నాగేంద్ర భరద్వాజ్ కు ఇచ్చి 2020లో పెళ్లి చేశారు. వారికి ఏడాదిన్నర వయసు ఉన్న ఒక కుమారుడు ఉన్నాడు. భార్యభర్తలు ఇద్దరూ ఐటీ ఉద్యోగులు. బాచుపల్లి సాయి అనురాగ్ కాలనీలో ఎంఎస్ఆర్ ప్లాజాలో వీరి నివాసం. పెళ్లి తర్వాత నుంచి భార్యను తరచూ హింసించేవాడు. దీనికి తోడు అనుమానం రోగంతో వేధింపులకు గురి చేసేవాడు. కొడుకు పుట్టిన ఏడాది వరకు చూసేందుకు వెళ్లలేదు.

భార్యభర్తల మధ్య ఉన్న పంచాయితీని ఒక కొలిక్కి తీసుకొచ్చి.. భర్తతో సర్దుకుపోవాలంటూ మధులతను పెద్దలు ఒప్పించి.. ఫిబ్రవరి 15న కాపురానికి పంపారు. అయినప్పటికి భరద్వాజ్ తీరులో మార్పు రాలేదు. ఈ నెల నాలుగు రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో.. ఆవేశానికి గురైన భరద్వాజ్ భార్య మెడతో పాటు పలుచోట్ల పొడిచి హత్య చేశాడు. డెడ్ బాడీని ముక్కలు చేసి పడేయాలని అనుకున్నాడు. కానీ.. సాధ్యం కాలేదు.

దీంతో.. హత్య చేసిన గదిలో ఒక సిలిండర్ ఉంచి.. మరో సిలిండర్ ను కిచెన్ లో పెట్టాడు. గ్యాస్ లీక్ అయ్యేలా చేసి.. దాన్ని ఆత్మహత్యగా మార్చాలని భావించాడు. అయితే.. ఆ ప్లాన్ వర్కువుట్ కాలేదు. దీంతో.. ఇంటికి తాళం వేసి కొడుకును తీసుకొని చందానగర్ లోని తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. విషయం అతనికి చెప్పి.. కత్తితో ఛాతీపై పొడుచుకున్నాడు. ఇతగాడి విపరీత ధోరణికి భయపడిన స్నేహితుడు డయల్ 100కు సమాచారం ఇచమచారు.