Begin typing your search above and press return to search.

గ్యాంగ్‌ స్టర్‌ తో వెళ్లిపోయిన ఐఏఎస్‌ అధికారి భార్య కీలక నిర్ణయం!

ఈ క్రమంలోనే గుజరాత్ లో జరిగిన ఘటన! గ్యాంగ్ స్టర్ తో పారిపోయిన ఐఏఎస్ అధికారి భార్య వ్యవహారం!

By:  Tupaki Desk   |   23 July 2024 5:01 AM GMT
గ్యాంగ్‌  స్టర్‌  తో వెళ్లిపోయిన ఐఏఎస్‌  అధికారి భార్య కీలక నిర్ణయం!
X

ఈ సమాజంలో వెలుగులోకి వచ్చే కొన్ని సంఘటనలు బహు విచిత్రంగా ఉండటంతో పాటు షాకింగ్ గానూ ఉంటుంటాయి. కొన్ని సందర్భాల్లో కొంతమంది తీసుకున్న నిర్ణయాల వెనుకున్న పరమార్థం ఎవరికీ అర్థం కాదన్నట్లుగా ఉంటుంటుంది. ఈ క్రమంలోనే గుజరాత్ లో జరిగిన ఘటన! గ్యాంగ్ స్టర్ తో పారిపోయిన ఐఏఎస్ అధికారి భార్య వ్యవహారం!

అవును... ఓ ఐఏఎస్ అధికారి భార్య తనకు పరిచయమైన గ్యాంగ్ స్టర్ తో కలిసిపోయింది. అతడితో కలిసి నేరాలకు పాల్పడింది. ఈ క్రమంలో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఇంటి నుంచి పారిపోయింది. దీంతో... ఆ ఐఏఎస్ అధికారి విడాకులకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న ఆమె ఇంటికి తిరిగొచ్చింది.. కీలక నిర్ణయం తీసుకుంది.

వివరాళ్లోకి వెళ్తే... గుజరాత్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి రణ్ జిత్ కుమార్.. స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ లో సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన భార్య సూర్యజై కి కొంతకాలం క్రితం తమిళనాడుకు చెందిన ఓ గ్యాంగ్ స్టర్ తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో... సుమారు 9 నెలల క్రితం ఆమె ఆ గ్యాంగ్ స్టర్ తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది.

ఈ క్రమంలోనే జూలై 11న తమిళనాడులోని ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు వీరిద్దరూ ప్రయత్నించగా.. మదురై పోలీసులు తక్షణమే స్పందించి బాలుడిని కాపాడారు. అప్పటి నుంచి ఆ గ్యాంగ్ స్టర్, ఐఏఎస్ అధికారి భార్య సూర్యజై కొసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె గాంధీనగర్ లోని తన భర్త ఇంటికి వచ్చిందని అంటున్నారు. అయితే... ఆమె భర్త ఐఏఎస్ అధికారి మాత్రం ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు.

దీంతో గత్యంతరం లేకో ఏమో కానీ... విషయం తాగి 108కి ఫోన్ చేసింది. దీంతో.. ఆమెను 108 సిబ్బంది వచ్చి ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్సపోందుతూ ఆదివారం మృతిచెందినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే... ఆమె మృతదేహాన్ని చూసేందుకు కూడా ఆ ఐఏఎస్ అధికారి నిరాకరించినట్లు తెలుస్తోంది.