Begin typing your search above and press return to search.

బీఎండబ్ల్యూ ఓనర్ మూత్ర విసర్జన వివాదం: దెబ్బకు లెంపలేసుకున్నాడు

ఆహుజా "ఇలాంటి పనులు మళ్లీ చేయను" అని ఒక వీడియో విడుదల చేసి క్షమించమని కోరినా.. అసలు ప్రశ్న ఏమిటంటే ఈ రకమైన సంఘటనలు నిజంగా ఆగిపోతాయా?

By:  Tupaki Desk   |   10 March 2025 8:10 PM IST
బీఎండబ్ల్యూ ఓనర్ మూత్ర విసర్జన వివాదం:  దెబ్బకు లెంపలేసుకున్నాడు
X

స్వచ్ఛ భారత్ అంటూ ఎంతగా ప్రభుత్వాలు ప్రచారం చేసినా.. ప్రధాని మోడీ స్వయంగా చీపురు పట్టి ఊడ్చినా కూడా జనాల్లో ఆ స్వచ్ఛత సృహ లేకుంటే ఏమీ చేయలేం.. గొప్పింటి వారు కూడా ఇలా స్వచ్ఛత మరిచి రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తే..దాన్ని ఎవరూ ఆక్షేపించారు. మన పరిసరాలు మనం శుభ్రంగా ఉంచుకున్నప్పుడే అందరూ శుభ్రత పాటించినప్పుడే ఈ దేశం క్లీన్ అండ్ నీట్ దేశంగా మారుతుంది.

ఇండియాలో ప్రజా పరిశుభ్రత.. పారిశుధ్య సమస్యలతో మళ్లీ వార్తల్లోకి వచ్చింది. పుణేలోని ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఒక వ్యక్తి బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్న వీడియో వైరల్ అయ్యింది. బీఎండబ్ల్యూ నుంచి దిగి మూత్ర విసర్జన చేసిన గౌరవ్ ఆహుజా ఇప్పుడు ప్రజలకు క్షమాపణలు చెప్పారు. మహారాష్ట్ర ప్రజలు, పుణే నగరవాసులు, ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే లను తనను మన్నించాలని చేతులు జోడించి కోరుతున్నాడు.

ఆహుజా క్షమాపణ చెప్పినప్పటికీ అతడు ఆ పనిచేసినప్పుడు వ్యవహరించిన తీరు చూసి ఎవరూ అతడి తీరును సహించడం లేదు. ఇలాంటి వారి వల్లనే దేశం మరింతగా అభాసుపాలవుతుందని అందరూ విమర్శిస్తున్నారు.

బహిరంగ మూత్ర విసర్జన, ఓపెన్ డిఫికేషన్, అధ్వాన్నమైన పారిశుధ్య అలవాట్లు దేశాన్ని ఇప్పటికీ బాధిస్తున్నాయి. స్వచ్ఛ భారత్ అభియాన్ వంటి అనేక ప్రభుత్వ కార్యక్రమాలు అమలులో ఉన్నప్పటికీ ఈ సమస్యలు పూర్తిగా తగ్గడం లేదు. భారతదేశం ప్రపంచ వేదికపై పరిశుభ్రత పరంగా తరచుగా విమర్శలు ఎదుర్కొంటూ, అనేక నగరాలు క్లీన్‌లైనెస్ ఇండెక్స్‌లో వెనుకబడి ఉంటాయి.

బీఎండబ్ల్యూ నుంచి దిగి మూత్ర విసర్జన చేసిన ఘటన ఎందుకు ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే.. పుణే వంటి మహానగరాల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతుండడం... బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లు కొనగలిగే వారు కూడా కనీస పౌర బాధ్యతను పాటించకపోవడం చూసి అందరూ విస్మయం చెందుతున్నారు. పరిశుభ్రతపై దేశ ప్రజల వైఖరి మారలేదనడానికి ఇది నిదర్శనం... ఇది కేవలం వ్యక్తిగత బాధ్యత గురించి కాకుండా, వ్యవస్థాపిత లోపాలను కూడా సూచిస్తోంది. ప్రభుత్వ మరుగుదొడ్ల కొరత, పౌర చట్టాల అమలు అంతగా ప్రభావవంతంగా లేకపోవడం, పరిశుభ్రతపై ప్రజల్లో అనాసక్తి వంటివి దీని వెనుక ఉన్నత సమస్యలు.

ఆహుజా "ఇలాంటి పనులు మళ్లీ చేయను" అని ఒక వీడియో విడుదల చేసి క్షమించమని కోరినా.. అసలు ప్రశ్న ఏమిటంటే ఈ రకమైన సంఘటనలు నిజంగా ఆగిపోతాయా? అన్నది ప్రశ్న.. ఇలాంటి ఘటనలతోనే దేశంలోని పరిశుభ్రత లోపాలు బయటపడుతున్నాయి. అవమానకరరీతిలో మరింతగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది..