Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ విజయం తధ్యమంటున్న ఇండియా టుడే సర్వే !

ఇక బీజేపీకి నాలుగు నుంచి ఎనిమిది సీట్లు దాకా వస్తాయని సర్వే తేల్చింది. అలాగే ఇతరులకు 5 నుంచి 8 సీట్లు లభిస్తాయని కూడా వెల్లడించింది

By:  Tupaki Desk   |   2 Dec 2023 1:53 AM GMT
కాంగ్రెస్ విజయం తధ్యమంటున్న ఇండియా టుడే సర్వే  !
X

తెలంగాణాలో కాంగ్రెస్ విజయం తధ్యమంటూ మరో సర్వే బల్ల గుద్ది మరీ చెబుతోంది. ఇండియా టుడే ఆక్సిస్ మై ఇండియా సర్వే తెలంగాణాలో కాంగ్రెస్ కి కంఫర్టబుల్ మెజారిటీ వస్తుంది అని పేర్కొంటూ ఎగ్జిట్ పోల్ సర్వేని రిలీజ్ చేసింది. ఇండియా టుడే సర్వే ప్రకారం చూస్తే కాంగ్రెస్ కి 63 నుంచి 73 దాకా సీట్లు దక్కనున్నాయి. బీయారెస్ కి 34 నుంచి 44 దాకా సీట్లు లభిస్తాయని ఈ సర్వే స్పష్టం చేసింది.

ఇక బీజేపీకి నాలుగు నుంచి ఎనిమిది సీట్లు దాకా వస్తాయని సర్వే తేల్చింది. అలాగే ఇతరులకు 5 నుంచి 8 సీట్లు లభిస్తాయని కూడా వెల్లడించింది. ఇప్పటికే అనేక సర్వేలు తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తేల్చేశాయి. ఇపుడు ఇండియా టుడే అదే మాటను మరో మారు గట్టిగా చెబుతోంది.

ఇదిలా ఉండగా తెలంగాణాలో కాంగ్రెస్ కి 80 సీట్లకు తక్కువ కాకుండా వస్తాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంచనా కట్టారు. ఈ సర్వే నివేదిక కంటే కూడా ఎక్కువే వస్తాయని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అలాగే తాము ఇచ్చిన హామీల మేరకు ప్రజలకు న్యాయం చేస్తామని కూడ ఆయన అంటున్నారు.

మరో వైపు చూస్తే తెలంగాణాలో కాంగ్రెస్ కి అధికారం అని చెప్పిన అనేక సర్వేల సారాంశం కూడా ఇదే. దాంతో కాంగ్రెస్ వర్గాలు ఉత్సాహం మీద ఉన్నాయి. రాబోయేది హస్తం పార్టీ ప్రభుత్వమే అని కూడా ధీమా వ్యక్తం చేస్తూ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.