Begin typing your search above and press return to search.

తొమ్మిదోసారి...జగన్ రాజకీయ వంటకం అక్కడే !?

వైఎస్ జగన్ కేరాఫ్ తాడేపల్లి. ఇది పాత మాట. ఆయన అసలు చిరునామా బెంగళూరు.

By:  Tupaki Desk   |   15 Sep 2024 3:38 PM GMT
తొమ్మిదోసారి...జగన్ రాజకీయ వంటకం అక్కడే !?
X

వైఎస్ జగన్ కేరాఫ్ తాడేపల్లి. ఇది పాత మాట. ఆయన అసలు చిరునామా బెంగళూరు. ఆయన ఓటమి తరువాత బెంగళూరు లోని తన ప్యాలెస్ కి మకాం మార్చేశారు. ఆయన తాడేపల్లికి చుట్టపు చూపుగా వచ్చి పోతున్నారు అని ప్రత్యర్ధులు విమర్శలు చేస్తూ వస్తున్నారు.

అయినా వైసీపీ చీఫ్ అసలు పట్టించుకోవడంలేదు. ఆయన ఆలోచనలు వేరేగా ఉన్నాయి. బెంగళూరులో అయితే తన రాజకీయ వంటకానికి ఏ విధంగానూ అవరోధాలు రావు అన్నదే జగన్ ఆలోచన. మరో వైపు చూస్తే జగన్ కి బెంగళూరు పూర్తి సేఫ్ జోన్ గా ఉంది అని అంటున్నారు. ఆయన హైదరాబాద్ కంటే కూడా బెంగళూరు ని అందుకే ప్రిఫర్ చేస్తున్నారు అని అంటున్నారు.

బెంగళూరు లో జగన్ కి ఎంతో అనుబంధం ఉంది. మూడు దశాబ్దాల పరిచయాలు ఉన్నాయి. పైగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అందులో ఒక కీలక నేత, ట్రబుల్ షూటర్ తో కూడా గట్టి బంధాలు ఉన్నాయని అంటున్నారు. వైఎస్సార్ ఫ్యామిలికీకి హితుడు అయిన ఆయనతో జగన్ కి గుడ్ రిలేషన్స్ ఉన్నాయని అంటున్నారు.

అందుకే ఆయన అక్కడ మకాం చేసేందుకు ఇష్టపడుతున్నారు అని అంటున్నారు. ఇక బెంగళూరు లో జగన్ నివాసానికి తరచూ కాంగ్రెస్ నేతలు వస్తున్నారు అని ప్రచారం కూడా సాగుతోంది. వారం పది రోజుల క్రితం ఒక వీకెండ్ లో జగన్ కాంగ్రెస్ నేతలకు తన ప్యాలెస్ లో విందు కూడా ఇచ్చారు అని టీడీపీ ఆరోపించింది.

అంతే కాదు ఆయన అక్కడ ఎవరిని కలసినా కూడా అది సీక్రెట్ గా ఉంటుందనే అలా అక్కడికి వెళ్తున్నారు అని అంటున్నారు. బీజేపీ మీద విరక్తిని పెంచుకున్న జగన్ వైసీపీని కాంగ్రెస్ కి టచ్ లోకి తేవడానికే ఎంతో ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు

అందుకే ఆయన బెంగళూరు నుంచే ఆ దిశగా రాజకీయ మంతనాలు జరుపుతున్నారు అని అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే ఇండియా కూటమిలోకి వైసీపీ చేరడం ఖాయమని కూడా అంటున్నారు. ఈ ఏడాది లో నాలుగు అసెంబ్లీలకు ఎన్నికలు ఉన్నాయి. వాటిలో మెజారిటీ కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి.

అలా దేశంలో కాంగ్రెస్ విస్తరిస్తున్న క్రమంలో ఇండియా కూటమిదే ఫ్యూచర్ అని భావిస్తున్న వైసీపీ అధినాయకత్వం ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. మరో వైపు చూస్తే వైసీపీకి జాతీయ స్థాయిలో ఇపుడు బలం కావాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. ఆ అండ కాంగ్రెస్ నుంచి ఇండియా కూటమి నుంచే కోరుకుంటున్నారు అని అంటున్నారు.

అయితే ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి అంటే సీక్రెట్ ని ఎంత వీలు అయితే అంతలా మెయింటెయిన్ చేయాల్సిన అవసరం ఉందని కూడా వైసీపీ హై కమాండ్ భావిస్తోంది అని అంటున్నారు. మొత్తానికి జగన్ నాలుగు రోజుల క్రితమే తాడేపల్లికి వచ్చారు. మళ్లీ బెంగళూరుకు పయనం అయ్యారని, ఇది లెక్క సరి చూస్తే తొమ్మిదవ సారి అని అంటున్నారు.

కాంగ్రెస్ హై కమాండ్ అసెంబ్లీ ఎన్నికల హడావుడిలో ఉంది. అది ముగియగానే ఏపీ మీద ఫోకస్ పెడుతుందని అపుడే వైసీపీ విషయం కూడా కీలకం అవుతుందని అంటున్నారు. వైసీపీని ఇండియా కూటమిలోకి కనుక ఆహ్వానిస్తే కచ్చితంగా అది ఏపీ పాలిటిక్స్ లో హైలెట్ అవుతుంది. ఏకంగా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది అని అంటున్నారు. మరి జగన్ బెంగళూరు వంటకం విజయవంతం అవుతుందా లేదా అని చూడాలని అంటున్నారు. అంతే కాదు అసలు జగన్ బెంగళూరు వెళ్తోంది దీని కోసమే అన్న పుకార్లు నిజమవుతాయా అయితే అవి ఎపుడు అన్న చర్చ కూడా సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.