Begin typing your search above and press return to search.

ట్రెండింగ్... జగన్ కవరింగ్.. షర్మిల బ్లాస్టింగ్!

ఈ వ్యవహారంపై విజయనగరం పర్యటనలో జగన్ స్పందించారు.

By:  Tupaki Desk   |   24 Oct 2024 1:14 PM GMT
ట్రెండింగ్... జగన్  కవరింగ్.. షర్మిల బ్లాస్టింగ్!
X

ప్రస్తుతం ఏపీలో వైఎస్ జగన్ - షర్మిల మధ్య జరుగుతున్న ఆస్తుల పంపకాల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో జగన్ పప్పులో కాలేశారనే చర్చా తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంపై విజయనగరం పర్యటనలో జగన్ స్పందించారు. ఇది అందరి ఇళ్లల్లో ఉండేవే అన్నారు. దీంతో.. షర్మిళ మళ్లీ తగులుకున్నారు.

అవును... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు జగన్ - షర్మిల ఆస్తుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో జగన్, షర్మిల లేఖలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ సమయంలో స్పందించిన జగన్... తాను గుర్లకు వస్తున్నానని తెలిసి మళ్లీ మొదలుపెట్టారని.. మా కుటుంబ విషయాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు.

ఇదంతా ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకే అని చెప్పారు. అనంతరం... అమ్మ, చెల్లెలు ఫోటో పెట్టి రాజకీయం మొదలుపెట్టారని.. ఇవన్నీ ప్రతీ ఇంట్లో ఉన్న విషయాలే అని.. వీటిని చంద్రబాబు తన స్వార్ధం కోసం పెద్దవి చేసి చూపిస్తున్నారని.. ఇవన్నీ మానుకుని ప్రజలపై ద్యాస పెట్టాలని.. సూచించారు. దీనిపై షర్మిల సూటిగా, ఘాటుగా స్పందించారు!

ఇందులో భాగంగా... ప్రతి ఇంట్లో ఇలాంటి అనుభవాలు ఉంటాయనేది నిజమే కానీ.. అని మొదలుపెట్టిన షర్మిళ... ఏ మగాడూ తన సొంత చెల్లిని, తల్లిని ఆస్తి విషయంలో కోర్టుకు లాగడు అని అన్నారు! ఆస్తి తగాదాలపై తల్లీ, చెల్లిని కోర్టుకు లాగడం సర్వసాధారణమైన విషయం కాదని.. ఇది తేలిగ్గా తీసుకునే అంశం కాదన్నట్లుగా షర్మిల రియాక్ట్ అయ్యారు!

దీంతో.. వైఎస్ ఫ్యామిలీ ఆస్తుల వ్యవహారంపై తీవ్ర చర్చ నడుస్తున్న వేళ.. "ఇది అందరి ఇళ్లల్లోనూ జరిగేదే" అంటూ జగన్ చేసిన కవరింగ్ కామెంట్లకు షర్మిళ బ్లాస్టింగ్ రిప్లై ఇచ్చారంటూ కామెంట్లు మొదలైపోయాయి!