Begin typing your search above and press return to search.

బెంగళూరులో పెళ్లిళ్లు చూసుకుంటున్న మాజీ సీఎం దంపతులు!

ఇదే సమయంలో శుభకార్యాలకూ హాజరవుతూ యాక్టివ్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బెంగళూరులో ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు.

By:  Tupaki Desk   |   19 Aug 2024 4:45 AM GMT
బెంగళూరులో పెళ్లిళ్లు చూసుకుంటున్న మాజీ సీఎం దంపతులు!
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం అతికొద్ది రోజులు షాక్ లో ఉన్నట్లు కనిపించిన జగన్.. అనంతరం తేరుకుని తిరిగి ప్రజలతో మమేకమవ్వడం మొదలుపెట్టారు! ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలను కలుస్తున్నారు.. ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఇదే సమయంలో శుభకార్యాలకూ హాజరవుతూ యాక్టివ్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బెంగళూరులో ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు.

అవును... శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి వివాహానికి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ హాజరయ్యారు. సతీమణి భారతితో కలిసి ఆయన ఈ వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ దంపతులు.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం బెంగళూరులో జరిగింది.

బెంగళూరు మారియట్ హోటల్ లో జరిగిన ఈ వివాహ వేడుకలో నూతన వధూవరులు పవిత్ర రెడ్డి, డాక్టర్ కౌశిక్ రెడ్డిలకు వైఎస్ జగన్, భారతి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

కాగా ఈ నెల 1వ తేదీన జగన్ దంపతులను కలిసిన.. బియ్యపు మధుసూదన్ రెడ్డి దంపతులు వివాహానికి రావాలని ఆహ్వానించారు. ఈ విషయాలను పంచుకున్న బియ్యపు... "మా కుమార్తె వివాహం డాక్టర్ కౌషిక్ రెడ్డితో జరగనున్న శుభ సందర్భంగా జగన్ గారి దంపతులకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి, మా బిడ్డ వివాహానికి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించాల్సిందిగా కోరడం జరిగింది" అని తెలిపారు.

మరోపక్క... ఈ రోజు రాఖీపౌర్ణమి సందర్భంగా జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా... "నా అక్కచెల్లెమ్మలందరికీ రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మీరు మరింత ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రయాణంలో మీకు ఎల్లప్పుడూ నేను తోడుగా ఉంటాను. కుటుంబాలకు మంచి భవిష్యత్తును అందించడంలో అక్కచెల్లెమ్మల పాత్ర కీలకమని నేను బలంగా నమ్ముతాను" అని ట్వీట్ చేశారు.