Begin typing your search above and press return to search.

‘‘68’’ సీట్ల మీదనే జగన్ ఫుల్ ఫోకస్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్న నినాదాన్ని తీసుకున్న వైనాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తుంటారు.

By:  Tupaki Desk   |   24 March 2024 9:16 PM IST
‘‘68’’ సీట్ల మీదనే జగన్ ఫుల్ ఫోకస్
X

అసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం తప్పేం కాదు. డ్రీం బిగ్ అన్నట్లుగా చారిత్రక విజయం ఎప్పుడూ అసాధారణ లక్ష్యంతోనే మొదలవుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్న నినాదాన్ని తీసుకున్న వైనాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తుంటారు. సాపేక్షంగా చూస్తే.. ఇదేమీ అసాధ్యమైన అంశం కాదు. ఎందుకంటే.. మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఒక వర్గం తీవ్రమైన వ్యతిరేకతతో ప్రచారం చేస్తున్నప్పటికి ఏపీ అధికార పార్టీకి సానుకూలాంశాలు ఎక్కువగా ఉండటం దేనికి సంకేతం? అదే సమయంలో ఆ పార్టీ ప్రత్యర్థులైన టీడీపీ.. జనసేన.. బీజేపీలు విజయం కోసం చెమటలు చిందించటం చూస్తేనే.. వైసీపీ ఎంత బలంగా ఉందన్న విషయం అర్థమవుతుంది.

అలాంటప్పుడు వైనాట్ 175? అంటూ నినదించటం అత్యాశేమీ కాదన్న మాట వినిపిస్తోంది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య రీతిలో 151 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ ఇప్పుడు అంతకు మించిన స్థానాల్లో గెలుపు సాధ్యమేనా? అంటే అవునన్న సమాధానం వస్తోంది. కాకుంటే.. చిన్నపాటి ఫార్ములాను ఫాలో అయితే అనూహ్య గెలుపు పక్కా అన్న వాదనను వినిపిస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలిచిన 151 స్థానాల్ని చూస్తే.. అందులో కనిష్ఠంగా ఉన్న మెజార్టీ ‘‘25’’ ఓట్లు అయితే.. గరిష్ఠంగా వచ్చిన మెజార్టీ ‘‘90,110’’. ఈ గణాంకాలతో ఏం చెప్పబోతున్నారంటారా? కాస్త డిటైల్డ్ గా చదివేయండి.

గత ఎన్నికల్లో గెలిచిన 151 స్థానాల్లో పది వేల కంటే తక్కువ మెజార్టీ వచ్చిన సీట్లు 44. ఓడిన సీట్లు 24 (తెలుగుదేశం 23, జనసేన 1) మొత్తంగా 68 సీట్లు. వీటిల్లో 12 అసెంబ్లీ స్థానాల్లో 5 వేల కంటే తక్కువ మెజార్టీతో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో 22 మంది ఎమ్మెల్యేలు ఐదు వేల నుంచి పది వేల లోపు మెజార్టీతో విజయం సాధించారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో డేంజర్ బెల్ మోగించే నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయంటే ఇవే అవుతాయి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో పది వేలకు మించి మెజార్టీ సాధించటం అంటే.. మెజార్టీలో 30 శాతం తగ్గినా కూడా గెలుపు ధీమా ఉన్నట్లే.

అందుకే పది వేల కంటే తక్కువ మెజార్టీ వచ్చిన 44 స్థానాలతో పాటు విపక్షాలు గెలిచిన 24 స్థానాల మీద ప్రత్యేక శ్రద్ధను ప్రదర్శిస్తే వైనాట్ 175కు దగ్గరగా వెళ్లొచ్చన్న మాట వినిపిస్తోంది. అధికార పార్టీగా తొలుత తాను ఓడిన 24 స్థానాల మీద ఎక్కువ ఫోకస్ చేయటంతోపాటు.. 5వేల కంటే తక్కువ మెజార్టీ వచ్చిన 12 స్థానాల మీద ప్రత్యేక ఫోకస్ పెడితే అనూహ్య ఫలితాలకు అవకాశం ఉంటుందన్న మాట వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఐదు వేల కంటే తక్కువ మెజార్టీ వచ్చిన 12 నియోజకవర్గాల్ని చూస్తే..

నియోజకవర్గం మెజార్టీ

విజయవాడ సెంట్రల్ 25

తిరుపతి 708

పొన్నూరు 1,112

నెల్లూరు సిటీ 1,988

తణుకు 2,195

నగరి 2,708

కొత్తపేట 4,038

ఏలూరు 4,072

ఎలమంచిలి 4,146

తాడికొండ (ఎస్సీ) 4,433

ప్రత్తిపాడు 4,611

జగ్గయ్యపేట 4,778

అదే సమయంలో 10వేల కంటే తక్కువ మెజార్టీ వచ్చిన 22 స్థానాలు.. వాటి మెజార్టీని చూస్తే..

రామచంద్రపురం 5,168

మంగళగిరి 5,337

కర్నూలు 5,353

ముమ్మిడివరం 5,547

శ్రీకాకుళం 5,777

మచిలీపట్టణం 5,851

విజయనగరం 6,417

నరసాపురం 6,436

ప్రత్తిపాడు (ఎస్సీ) 7,398

తాడిపత్రి 7,511

విజయవాడ వెస్ట్ 7,671

పెడన 7,839

పీలేరు 7,874

అనకాపల్లి 8,169

చిలకలూరిపేట 8,301

బొబ్బిలి 8,352

భీమవరం 8,357

కాకినాడ రూరల్ 8,789

సంతనూతలపాడు 9,078

కైకలూరు 9,357

భీమిలి 9,712

వేమూరు (ఎస్సీ) 9,999

పది వేల కంటే తక్కువ మెజార్టీ వచ్చిన 34 స్థానాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టటం ద్వారా అనూహ్య ఫలితాలకు అవకాశం ఉంటుంది. ఆ దిశగా వైసీపీ ఇప్పటికే వ్యూహ రచన చేసిందన్న మాట వినిపిస్తోంది. దీనికి విరుగుడుగా విపక్షాలు ఎలా రియాక్టు అవుతాయో చూడాలి.