Begin typing your search above and press return to search.

జగన్ వేసిన ట్వీట్ వైరల్

ఆ ట్వీట్ లో చూస్తే కనుక ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు

By:  Tupaki Desk   |   3 Jun 2024 6:56 PM GMT
జగన్ వేసిన ట్వీట్ వైరల్
X

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పార్టీ శ్రేణులకు ఒక విన్నపం చేశారు. మరి కొద్ది గంటలలో ఎన్నికల ఫలితాలు రానుండగా వైసీపీ తరఫున కౌంటింగ్ ఏజెంట్లుగా వ్యవహరించబోతున్నా వారందరినీ ఉద్దేశించి ఆయన సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత వేసిన ఈ ట్వీట్ వైరల్ అయింది.

ఆ ట్వీట్ లో చూస్తే కనుక ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను. అని జగన్ ముగించారు.

ఇది ఒక విధంగా చూస్తే పార్టీ శ్రేణులకు బూస్టింగ్ లాంటిదే. పార్టీకి అఖండ విజయం చేకూర్చండి అంటూ జగన్ వారికి విన్నపం చేశారు. కౌంటింగ్ అంటే ఒకే ఒక్క అడుగు దూరంలో విజయం ఉంది. ప్రతీ ఒక్క ఓటూ కీలకం అయిన వేళ కౌంటింగ్ ఏజెంట్ల మీదనే గురుతర బాధ్యత ఉంది. పొరపాటున వారు పడే ఓట్లను కాకుండా చేసుకుంటే మాత్రం మొత్తం ఫలితాల్లోనే తేడా కొట్టవచ్చు. అందుకే వారికి శిక్షణను ఎక్కడికక్కడ ఇచ్చారు. అంతే కాదు వారిని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు.

వైసీపీ ఆ విధంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తే టీడీపీ సైతం అదే పని చేసింది. అవతల పక్షం రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు అని రెండు పార్టీలూ చెప్పాయి. ఎందుకంటే అక్కడ కావాల్సింది సహనం. ఆవేశం ఎంతమాత్రం కాదు, తమ వైపు ఓటు ఎలా కౌంట్ అయ్యేలా చేసుకోవాలో అన్నది కౌంటింగ్ ఏజెంట్ కి అతి ముఖ్యమైన బాధ్యత.

అందుకే కౌంటింగ్ ఏజెంట్ల చేతిలోనే అంతా ఉందనే అధినేతలు వారికి ఒకటికి పది సార్లు ఈ విధంగా సూచనలు చేస్తున్నారు. జగన్ అయినా చంద్రబాబు అయినా వారిని ఉత్సాహపరుస్తూనే తమ విజయం తధ్యమని చెబుతున్నారు. జగన్ వేసిన ఈ ట్వీట్ వైసీపీకి ఆక్సిజన్ లాంటిది అని అంటున్నారు.