Begin typing your search above and press return to search.

జగన్ పాలనలో చివరి ఆరునెలల్లో ఇంత జరిగిందా?

ఈ నేపథ్యంలో తాజాగా జగన్ చివరి ఆరు నెలల్లో చేసిన ఒక దారుణమైన వ్యవహారం తెరపకి వచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారం వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   13 July 2024 5:15 AM GMT
జగన్ పాలనలో చివరి ఆరునెలల్లో ఇంత జరిగిందా?
X

ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలనలో జరిగిన దారుణాలు, అక్రమాలు తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తునాయనే కామెంట్లు ఏపీ రాజకీయాల్లో బలంగా వినిపిస్తున్నాయి. వాటిని బలం చేకూరుస్తూ రోజు రోజుకో సరికొత్త వ్యవహారం వెలుగులోకి వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జగన్ చివరి ఆరు నెలల్లో చేసిన ఒక దారుణమైన వ్యవహారం తెరపకి వచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారం వైరల్ గా మారింది.

అవును... గత ఆరు నెలల్లో వైసీపీ సర్కార్ హయాంలో ఏపీలో జరిగిన ఎసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్ అంశం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా గత ఆరు నెలల్లో సుమారు 39,398.07 ఎకరాల ఎసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయని అంటున్నారు. దీంతో... పేదలకు కేటాయించిన /ఈ ఎసైన్డ్ భూములను వైసీపీ నేతలు, పలువురు అధికారులు కొట్టేశారని అంటున్నారు.

ఎసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కుల కల్పనపై నాటి వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందుగా పేదల నుంచి ఆ పార్టీ నేతలు, సీనియర్ అధికారులు, ముందస్తు ఒప్పందాలు చేసుకునొన్నారని. ఆ విధంగా పేదల భూములు చౌక ధరకు కొనుగోలు చేశారని అంటున్నారు. ఇదే సమయంలో యాజమాన్య హక్కుల కల్పన నిర్ణయం అనంతరం... నిషిద్ద జాబితా 22(ఏ) నుంచి రాష్ట్రవ్యాప్తంగా 9,00,975.23 ఎకరాలను తొలగించారని చెబుతున్నారు.

ఇలా వైసీపీ ప్రభుత్వ హయాంలో యాజమాన్య హక్కుల కల్పన నిర్ణయం వెలువడిన వెంటనే కొంతమంది పెద్దలు తమ పలుకుబడిని ఉపయోగించి తమ పేరిట, బినామీల పేరిట రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని అంటున్నారు. ఈ సమయంలో జీవో నెంబర్ 596 అమలును తాత్కాలికంగా నిలిపివేసిన ప్రస్తుత ప్రభుత్వం... వాస్తవాలపై స్పష్టత వచ్చిన అనంతరం మార్పులు, చేర్పులపై ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

వైసీపీ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ శాఖ ఐజీగా ఉన్న రామకృష్ణ తాజాగా ప్రభుత్వానికి ఈ వివరాలు పంపించడం గమనార్హం. ఈయనకు గతంలో వైసీపీ సర్కార్ తో అంటకాగారనే ఆరోపణలు వినిపించాయి! ఆయనే ఈ భూముల రిజిస్ట్రేషన్లు జరిగేందుకు వీలుగా హడావుడిగా ఉత్తర్వులు ఇచ్చిన పరిస్థితి! ఇదే క్రమంలో... ఎసైన్డ్‌ భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేయదంపై ఇటీవల వరకూ సీఎస్ గా ఉన్న జవహార్ రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే!

కాగా... గత ఏడాది జూలై 31 నాటికంటే ఇరవై ఏళ్ల ముందు ఎసైన్‌ చేసిన అగ్రికల్చర్ ల్యాండ్స్ ను అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తూ గత ఏడాది అక్టోబర్ 27న వైసీపీ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా జీవో 596 విడుదలైంది. ఇదే సమయంలో... ఈ భూముల రిజిస్ట్రేషన్లు వేగంగా జరిగేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ ఈ ఏడాది జనవరిలో మూడు మెమోలు కూడా జారీచేశారు.