Begin typing your search above and press return to search.

ట్రంప్ వ్యాఖ్యలు ఆందోళనకరమన్న జైశంకర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. భారత ఎన్నికల్లో అమెరికా నిధులు వెచ్చించారన్న ఆరోపణలతో ఆయన విరుచుకుపడ్డారు.

By:  Tupaki Desk   |   23 Feb 2025 8:40 AM GMT
ట్రంప్ వ్యాఖ్యలు ఆందోళనకరమన్న జైశంకర్
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. భారత ఎన్నికల్లో అమెరికా నిధులు వెచ్చించారన్న ఆరోపణలతో ఆయన విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలు తీవ్ర కలవరపాటుకు గురిచేశాయని, భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం ఆందోళన కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

- జైశంకర్ స్పందన ఇదీ

జైశంకర్ మాట్లాడుతూ "ట్రంప్ వ్యాఖ్యలు మనకు ఆందోళన కలిగించే అంశమే. భారత ఎన్నికలు దేశీయ వ్యవహారం. ఎవరైనా ఏవైనా ఆరోపణలు చేస్తే, అవి ఆధారాలపై ఉండాలి. USAID నిధుల అంశంపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం. అన్ని వివరాలను సేకరించిన తర్వాత దీనిపై మరింత స్పష్టత ఇస్తాం" అని తెలిపారు.

- ట్రంప్ ఆరోపణలు ఇవీ

ట్రంప్ తన ఓప్రల్ ప్రచారంలో మాట్లాడుతూ భారత ఎన్నికల్లో అమెరికా ప్రభుత్వం నిధులను వినియోగించిందని ఆరోపించారు. ఈ నిధుల ద్వారా కొందరు అభ్యర్థులకు మద్దతు అందించినట్లు వ్యాఖ్యానించారు. కొందరినీ గెలిపించాలని ఈ భారీ నిధులు పంపారని ఆరోపించారు. అయితే ఆయన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు.

- భారత ప్రభుత్వ వైఖరి

భారత ప్రభుత్వం ఎప్పుడూ ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉంటుందని జైశంకర్ పేర్కొన్నారు. విదేశీ జోక్యాన్ని భారత ప్రజలు సహించరని, ఎలాంటి అవాస్తవ ఆరోపణలకూ ప్రాధాన్యత ఇవ్వబోమని స్పష్టం చేశారు.

- USAID వివరణ:

USAID (యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ ) ద్వారా అభివృద్ధి సహాయ నిధులు అందిన మాట వాస్తవమే. అయితే వీటిని ప్రభుత్వ పరంగా అభివృద్ధి ప్రాజెక్టులకే వినియోగించబడతాయని అధికార వర్గాలు వెల్లడించాయి. భారత ఎన్నికల వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.

ట్రంప్ ఆరోపణలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. అయితే, భారత ప్రభుత్వం దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి, నిజాలను వెల్లడించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టంగా తెలిపింది. రాజకీయ ఆరోపణలు ఏవైనా నిజానిజాలు నిర్ధారణ తర్వాతే విశ్వసించాలనే అభిప్రాయాన్ని విదేశాంగ శాఖ వ్యక్తం చేసింది.