Begin typing your search above and press return to search.

పవన్ స్పీచ్ కి రెడీ అయిన ఆటం బాంబులు...?

వందల వేలాది ఎకరాలు విశాఖలో హాం ఫట్ అయ్యానని మిస్సింగ్ వైజాగ్ ల్యాండ్ అంటూ సరికొత్త ఆరోపణలతో పవన్ వారాహి రధమెక్కి ఫైర్ అవుతారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   4 Aug 2023 2:30 PM GMT
పవన్ స్పీచ్ కి రెడీ అయిన ఆటం బాంబులు...?
X

జనసేన అధినేత అగ్రెసివ్ మోడ్ లో వెళ్తున్నారు. దూకుడు పెంచుతున్నారు తాను మామూలుగా మాట్లాడితే రావాల్సిన కవరేజ్ ఒకలా ఉంటే వివాదాస్పద కామెంట్స్ తో అది కాస్తా పీక్స్ కి చేరుతోందని జనసేన నాయకత్వం గ్రహిస్తోంది. గోదావరి జిల్లాలలో కాకినాడ ఎమ్మెల్యే మీద కామెంట్స్, ముద్రగడ పద్మనాభం మీద ఇండైరెక్ట్ సెటైర్లతో ఒక మోత మోగింది. అల్టిమేట్ అన్నట్లుగా వాలంటీర్ల వ్యవస్థ మీద పవన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో రీసౌండ్ చేశాయి.

అది ఇప్పటికీ చల్లారకుండానే ఉంది. ఇపుడు చూస్తే విశాఖలో మూడవ విడత వారాహీ యాత్రకు పవన్ సిద్ధపడుతున్నారు. ఈ యాత్రలో పవన్ ఏమి మాట్లాడుతారు అన్న ఆసక్తి అయితే రాజకీయ వర్గాలలో ఉంది.

అయితే పక్కాగా పవన్ స్పీచ్ కి స్క్రిప్ట్ రెడీ అయింది అని అంటున్నారు. విశాఖలో భూ కబ్జాల మీద పవన్ గొంతెత్తి గర్జిస్తారు అని అంటున్నారు. గడచిన నాలుగేళ్ల వైసీపీ ఏలుబడిలో విశాఖలో భూముల దందా బాగా పెరిగిందని, ఎక్కడ చూసినా గద్దల్లా భూములను పెద్దలు ఎగరేసుకుని పోయారని అంటున్నారు.

ఆ సబ్జెక్ట్ మీదనే పవన్ మాట్లాడుతారు అని అంటున్నారు. ఇది కనుక సరైన పద్ధతిలో పేల్చితే ఆటం బాంబే అవుతుందని అంటున్నారు. ఇపుడు దాని మీదనే జనసేన టీం కసరత్తు చేస్తోందిట. వందల వేలాది ఎకరాలు విశాఖలో హాం ఫట్ అయ్యానని, మిస్సింగ్ వైజాగ్ ల్యాండ్ అంటూ సరికొత్త ఆరోపణలతో పవన్ వారాహి రధమెక్కి ఫైర్ అవుతారు అని అంటున్నారు.

గోదావరి జిల్లాలో మిస్సింగ్ విమెన్ అంటూ పవన్ పేల్చిన డైలాగులు ఎలా వైరల్ అయ్యాయో ఇపుడు విశాఖ నుంచి మిస్సింగ్ ల్యాండ్స్ అంటూ పవన్ ఇచ్చే స్పీచ్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని అంటున్నారు. దీంతో అధికార వైసీపీని ఇరకాటంలో పెట్టవచ్చు అని పవన్ ఆలోచిస్తున్నారని అంటున్నారు.

ఇక ఏజెన్సీలో గంజాయి సాగు మీద రవాణా మీద విశాఖలో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతూ కేంద్రంగా మారుతోంది అని కూడా పవన్ హాట్ కామెంట్స్ చేస్తారు అని అంటుననరు. అలాగే ఏజెన్సీలో గనులను అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారు అని ఆయన విమర్శించే అవకాశాలు ఉన్నాయి.

విశాఖలో లా అండ్ ఆర్డర్ కట్టు తప్పిందని సాక్ష్యాత్తు సిట్టింగ్ ఎంపీ ఫ్యామిలీకే రక్షణ లేదని కిడ్నాప్ కధను మళ్లీ తెర మీదకు తెచ్చి విశాఖలో పొలిటికల్ గా పొలికేక పెట్టిస్తారు అని అంటున్నారు. మొత్తనికి విశాఖలో మూడవ విడత వారాహి యాత్రలో పవన్ పేల్చేందుకు అవసరం అయిన మందుగుండు సరంజామా రెడీ అయింది అని అంటున్నారు. మరి ఇది ఏ మేరకు వైరల్ అయి వైసీపీకి టచ్ చేస్తుందో చూడాల్సి ఉంది.