Begin typing your search above and press return to search.

మరో రచ్చకు తెర తీసిన కంగనా.. ఈసారి ఏకంగా జాతిపిత మీదనే!

ఆ పేరుతో నోటికి వచ్చినట్లుగా.. మనసుకు తోచినట్లుగా మాట్లాడేసి తరచూ వివాదాల్లో మునిగితేలే బాలీవుడ్ ‘క్వీన్’ కం ఎంపీ కంగనారౌనత్ మరోసారి నోరు పారేసుకున్నారు

By:  Tupaki Desk   |   3 Oct 2024 4:38 AM GMT
మరో రచ్చకు తెర తీసిన కంగనా.. ఈసారి ఏకంగా జాతిపిత మీదనే!
X

అభిప్రాయాలు చెప్పటం తప్పు కాదు. ఆ పేరుతో నోటికి వచ్చినట్లుగా.. మనసుకు తోచినట్లుగా మాట్లాడేసి తరచూ వివాదాల్లో మునిగితేలే బాలీవుడ్ ‘క్వీన్’ కం ఎంపీ కంగనారౌనత్ మరోసారి నోరు పారేసుకున్నారు. మొన్నటికి మొన్న వ్యవసాయ చట్టాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ బీజేపీలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. అయినప్పటికీ ఆమె తన తీరును మార్చుకోపోగా.. తాజాగా మరో సంచలనానికి తెర తీశారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కొత్త వివాదానికి తెర తీశారు.

బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ.. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అదిప్పుడు వివాదానికి కారణమైంది. శాస్త్రీజీ 120వ జయంతిని ఉద్దేశించి తన ఇన్ స్టాలో పెట్టిన పోస్టులో.. జాతిపితను తక్కువ చేసి చూపే భావం వచ్చేలా పోస్టు పెట్టటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. కంగనా తీరుపై మండిపాటు వ్యక్తమవుతోంది.

‘దేశానికి తండ్రులు ఉండరు. ముద్దు బిడ్డలే ఉంటారు. ఈ భరతమాత బిడ్డలు ధన్యులు’ అంటూ జాతిపిత గాంధీపై ఆమె పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దేశంలో స్వచ్ఛతా ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తే గాంధీ వారసత్వాన్ని ప్రధాని మోడీ ముందుకు తీసుకెళుతున్నట్లుగా పేర్కొన్న ఆమె.. మరోవైపు జాతిపితను అవహేళన చేసేలా పోస్టు ఉందన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా మరో వివాదానికి తెర తీసిన ఆమె.. రానున్న రోజుల్లో మరెన్ని మాటల మంటలకు కారణం అవుతారో చూడాలి.