Begin typing your search above and press return to search.

అరంగేట్రంలోనే అదరగొట్టింది

గత రెండు లోక్ సభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ విజయం సాధించింది.

By:  Tupaki Desk   |   4 Jun 2024 11:20 AM GMT
అరంగేట్రంలోనే అదరగొట్టింది
X

రాజకీయ అరంగేట్రంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ స్థానం నుండి ఘన విజయం సాధించింది, ఇక్కడ బీజేపీ తరపున కంగనా రనౌత్ పోటీ చేయగా, కాంగ్రెస్ నుండి హిమాచల్ కు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వీరభద్రసింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ పోటీ చేశాడు.

గత రెండు లోక్ సభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ విజయం సాధించింది. ఈసారి బీజేపీ టికెట్ ఆశించిన కులు మహేశ్వర్ సింగ్, మాజీ కేంద్రమంత్రి సుఖ్ రామ్ మనవడు ఆశ్రయ్ శర్మ కంగనాకు మద్దతుగా నిలబడ్డారు. సిట్టింగ్ కు ఇక్కడ టికెట్ నిరాకరించి కంగానాను బీజేపీ బరిలోకి దింపింది. ఎన్నికలు ముగియగానే కంగనా బట్టలు సర్దుకుని వెళ్లిపోతుందని ప్రచారంలో విమర్శలు వచ్చాయి. అయితే విక్రమాదిత్య సింగ్ ను చోటా పప్పుగా అభివర్ణిస్తూ కంగనా ప్రచారం నిర్వహించింది.

ఈ రోజు వెలువడ్డ ఫలితాలలో బీజేపీ అభ్యర్థి కంగనాకు 5,25,691 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ కు 4,52,995 ఓట్లు వచ్చాయి. 72,696 ఓట్లతో కంగనా ఘనవిజయం సాధించింది. హిమాచల్ ప్రదేశ్ లోని నాలుగు లోక్ స్థానాలలోనూ బీజేపీ విజయం సాధించడం విశేషం.