Begin typing your search above and press return to search.

స్కాంలోకి అచ్చెన్నను లాగుతున్న పాల్...పవన్ - బాబులపై ఫైర్!

అవును... టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ సంచలన ఆరోపణలు చేశారు

By:  Tupaki Desk   |   28 Sep 2023 5:51 AM GMT
స్కాంలోకి అచ్చెన్నను లాగుతున్న పాల్...పవన్ - బాబులపై ఫైర్!
X

టీడీపీ నేతలను, జనసేన అధినేతనూ విమర్శించడంలో.. తీవ్ర స్థాయిలో మండిపడటంలో గతకొన్ని రోజులుగా ఫుల్ ఫాం లో ఉన్నట్లు కనిపిస్తున్నారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌! గుండు గీయించుకునే కాపు కావాలా.. గుండు గీసే కాపు కావాలా అంటు పవన్ ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసే కేఏ పాల్... తాజాగా చంద్రబాబుపైనా తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. బాబుకు లోపలే ఉండాలని అంటున్నారు!

అవును... టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా... చంద్రబాబు దేశంలోనే అత్యంత అవినీతిపరుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవినీతి ఆకాశమంత ఎత్తుకు చేరుకుందని ఫైరయ్యారు. చంద్రబాబు అవినీతిలో లోకేష్‌ కు కూడా భాగస్వామ్యం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు ఆరు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేసిన పాల్... నిజంగా న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంటే విచారణకు సహకరించాలని సూచించారు. అదేవిధంగా... స్కిల్‌ డెవలప్మెంట్‌ కుంభకోణంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడిని కూడా అరెస్ట్‌ చేయాలని పాల్ సూచించారు.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండ్దటంపట్ల కనిపిస్తున్న నిరసనలపైనా కేఏ పాల్ స్పందించారు. ఇందులో భాగంగా... డబ్బులు ఇచ్చి పెయిడ్‌ ఉద్యమాలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన వ్యక్తి జ్జైలు జీవితం అనుభవించాల్సిందే అని నొక్కి వక్కానించారు.

అనంతరం పాల్... తమ్ముడు, తమ్ముడు అని పిలిచుకునే జనసేన అధినేత పవన్ పైనా స్పందించారు. ఇందులో భాగంగా కేవలం పాతిక సీట్ల కోసం పార్టీని పవన్ తాకట్టు పెట్టారని హాట్ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో... ప్యాకేజ్ కోసం కాపులను తాకట్టు పెడుతున్నారని కేఏ పాల్ తీవ్ర ఆరోపణ చేశారు.

దీంతో.. చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీ నేతల తర్వాత ఇంత డేరింగ్ అండ్ డాషింగ్ గా మాట్లాడిన పొలిటీషియన్, పార్టీ అధినేత.. కేఏ పాల్ మాత్రమే అని అంటున్నారు పరిశీలకులు. బాబు అరెస్ట్ పై మహా మహా నేతలమని చెప్పుకునేవారు సైతం సన్నాయినొక్కులు నొక్కుతున్న నేపథ్యంలో... కేఏ పాల్ ధైర్యంగా మాట్లాడగలిగారని చెబుతున్నారు.