Begin typing your search above and press return to search.

కారుమూరి విశాఖకు షిఫ్ట్ ?

వైసీపీకి చెందిన కీలక నేతలలో కారుమూరి నాగేశ్వరరావు ఒకరు. ఆయన గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుడు

By:  Tupaki Desk   |   8 Oct 2024 4:02 AM GMT
కారుమూరి విశాఖకు షిఫ్ట్ ?
X

వైసీపీకి చెందిన కీలక నేతలలో కారుమూరి నాగేశ్వరరావు ఒకరు. ఆయన గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుడు. తణుకు నియోజకవర్గం నుంచి వైసీపీ ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. టీడీపీ కూటమి ప్రభంజనంలో గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటూ దక్కలేదు. దాంతో ఆయన కూడా ఓటమి చెందారు. ఇటీవల కాలంలో కారుమూరి విశాఖలో ఎక్కువగా కనిపిస్తున్నారు ఆయన వైసీపీ ఆఫీసులో ఉంటున్నారు. పార్టీ నేతల మీటింగులో ఉంటున్నారు.

ఆయన కూడా విశాఖ నుంచే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. దీంతో వీటిని చూసిన వారు కారుమూరి మనసు విశాఖ వైపు మళ్ళిందా అన్న దాని మీద ఆలోచిస్తున్నారు. వైసీపీకి విశాఖ జిల్లాలో అయితే నాయకుల కొరత చాలానే ఉంది. దాంతో పాటు బలమైన సామాజిక వర్గానికి చెందిన కారుమూరు వంటి వారు వస్తే విశాఖ రాజకీయాల్లో బాగానే ఉంటుంది అని అంటున్నారు.

విశాఖ ఎందరో నాయకులకు ఆశ్రయం ఇచ్చింది. ఇపుడు కారుమూరి వచ్చినా జనాలు ఆహ్వానం పలుకుతారు అని అంటున్నారు. అయితే కారుమూరి విశాఖలో తన రాజకీయ యాక్టివిటీని పెంచుతారా లేక మామూలుగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా అన్నది ముందు ముందు తెలుస్తుంది అంటున్నారు.

కారుమూరి నాగేశ్వరరావు మాత్రమే కాదు చాలా మందికి విశాఖ మీద మనసు ఉంటుంది. ఎక్కడ నుంచో వచ్చిన వారు కూడా ఎంపీ ఎమ్మెల్యేలు అవుతున్నారు. దాంతో విశాఖ రాజకీయాల్లో కారుమూరి పాత్ర ఏ మేరకు ఉంటుంది అన్నది రానున్న రోజులలో తేలుతుంది అని అంటున్నారు.