Begin typing your search above and press return to search.

కేరళలో ‘బోణీ‘కొట్టిన బీజేపీ !

ఇక తిరువనంతపురం లోక్ సభ స్థానంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉత్కంఠ పోరు నడుస్తున్నది.

By:  Tupaki Desk   |   4 Jun 2024 9:56 AM GMT
కేరళలో ‘బోణీ‘కొట్టిన బీజేపీ !
X

కేరళలో బీజేపీ తొలిసారి బోణీ కొట్టింది. ప్రముఖ నటుడు సురేష్ గోపి కేరళలోని త్రిసూర్ లోక్ సభ స్థానం నుండి 73,120 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించాడు. సురేష్ గోపి 3,96,881 సాధించగా, సీపీఐ అభ్యర్థికి 3,23,761 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మురళీధరన్ 3,15,546 ఓట్లు సాధించారు. ఈ విజయంతో కేరళ బీజేపీ వర్గాలలో ఉత్సాహం నెలకొంది.

ఇక తిరువనంతపురం లోక్ సభ స్థానంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉత్కంఠ పోరు నడుస్తున్నది. ఇక్కడ ఫలితం రౌండ్ రౌండ్ కు మారుతున్నది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ 3,08,640 ఓట్లు సాధించి 4663 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ 3,03,977 ఓట్లు సాధించాడు.

ఇక రాష్ట్రంలోని పథనంతిట్ట, వడకర, అలప్పుజ, అలత్తూర్, అత్తింగల్, ఎర్నాకుళం, కాసర్ గోడ్, కొల్లం, కొట్టాయం, కొజికోడ్, మావెలిక్కర, పాలక్కడ్ లోక్ సభ స్థానాలలో భారతీయ జనతా పార్టీ గణనీయమైన ఓట్లు సాధించి మూడో స్థానంలో ఉండడం గమనార్హం.