Begin typing your search above and press return to search.

'ప్లీజ్ లోకేష్ అన్నా'... కువైట్ నుంచి మహిళ కన్నీటి అభ్యర్థన!

ఈ సమయంలో కొంతమంది పని బాగానే ఉంటుంది కానీ.. మరికొంతమంది పరిస్థితి మాత్రం అత్యంత దయణీయంగా ఉంటుంది.

By:  Tupaki Desk   |   27 Aug 2024 8:30 AM GMT
ప్లీజ్ లోకేష్ అన్నా... కువైట్ నుంచి మహిళ కన్నీటి అభ్యర్థన!
X

బిడ్డల భవిష్యత్తు కోసమో, కుటుంబ సమస్యల నిమిత్తమో.. నాలుగు రూపాయలు ఎక్కువ సంపాదించొచ్చని భావించి చాలామంది పరాయిదేశానికి వెళ్తంటారు. నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ఉన్న ఊరిని, అయినవారినీ వదిలి ఏళ్లపాటు పరాయిదేశంలో పనిచేసుకుంటూ ఉంటారు.

ఈ సమయంలో కొంతమంది పని బాగానే ఉంటుంది కానీ.. మరికొంతమంది పరిస్థితి మాత్రం అత్యంత దయణీయంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో నరకం చూస్తున్న వారు తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకుంటూ వీడియోలు విడుదల చేస్తున్నారు. తమను రక్షించాలని అభ్యర్థిస్తున్నారు.

ఈ క్రమంలో సమస్యల్లో ఉన్నవారిని, విదేశాల్లో చిక్కుకున్నవారినీ రక్షించి, స్వదేశానికి తీసుకువచ్చే విషయంలో లోకేష్ & కో సక్సెస్ అవుతూనే ఉన్నారు! ఈ నేపథ్యంలో తాజాగా ఓ మహిళ.. తన కష్టాలను చెప్పుకుంటూ దయచేసి తనను రక్షించాలని, తనకు చావు తప్ప మరో మార్గం లేదని చెబుతూ మంత్రి లోకేష్ కు విన్నవించారు.

తాజాగా కువైట్ కు వెళ్లిన ఏపీకి చెందిన ఓ మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా... పొట్టకూటి కోసం అక్కడకు వెళ్తే కడుపునిండా తిండి లేదు, కంటి నిండా కునుకు లేదు.. చేసిన పనికి జీతం లేదు.. ఇంటికి వెళానన్నా తన మొర వినడం లేదు అని వెల్లడించింది. తనను యజమాని చిత్రహింసలు పెడుతున్నాడని ఆమె తన బాధను తెలిపింది.

అవును... ఏపీలోని కాకినాడ జిల్లా ప్రత్తిప్పాడు మండలం రాచపల్లికి చెందిన నాగమణి అనే మహిళ కువైట్ లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తనను యజమాని చిత్రహింసలు పెడుతున్నాడని.. తనను వెంటనే భారత్ కు తీసుకురావాలని సెల్ఫీ వీడియో ద్వారా ఆ మహిళ కోరింది. తన ఆరోగ్యం క్షీణించిందని, నోటి నుంచి రక్తం పడుతుందని ఆమె వెల్లడించింది.

ఈ సమయంలో తనను పరిస్థితిని అర్ధం చేసుకోవాలని కోరుతూ... "ప్లీజ్ లోకేష్ అన్నా.." అంటూ ఆమె తన సెల్ఫీ వీడియోలో అభ్యర్థించారు.