Begin typing your search above and press return to search.

మహాలక్ష్మిని ముక్కలుగా నరికాడు... 'సడోమా సుకిస్టిక్' అంటే ఏమిటి?

అవును... నెలమంగల సమీపంలో మహాలక్ష్మీ అనే యువతిని అత్యంత కిరాతకంగా చంపి, ముక్కలుగా నరికి, ఫ్రిడ్జ్ లో కుక్కిన కిరాతకుడి విషయంలో వైద్య నిపుణులు కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   25 Sep 2024 6:52 AM GMT
మహాలక్ష్మిని  ముక్కలుగా నరికాడు... సడోమా సుకిస్టిక్ అంటే ఏమిటి?
X

బెంగళూరులోని నెలమంగల సమీపంలో మహాలక్ష్మీ (29) అనే యువతిని ముక్కలుగా నరికి, రిఫ్రిజిరేటర్ లో పెట్టిన కేసు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఒక్కమాటలో చెప్పాలంటే... ఈ ఘటన బెంగళూరును ఒక్కసారిగా వణికించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో కిరాతకుడి వ్యవహారంపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

అవును... నెలమంగల సమీపంలో మహాలక్ష్మీ అనే యువతిని అత్యంత కిరాతకంగా చంపి, ముక్కలుగా నరికి, ఫ్రిడ్జ్ లో కుక్కిన కిరాతకుడి విషయంలో వైద్య నిపుణులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... అతడిని సడోమా సుకిస్టిక్ అనే నేరస్వభావంతో రగిలిపోయినట్లు గుర్తించారని అంటున్నారు.

ఇలాంటి నేర స్వాభావం ఉన్న వ్యక్తిని తక్షణమే కట్టడిచేసి, కటకటాల వెనక్కి నెట్టాలాని.. అలాకానిపక్షంలో మరికొంతమంది ఇలాంటి కిరాతకాన్ని చవిచూసె ప్రమాదం ఉందని వైద్య నిపుణులు.. నగర పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అతడు ఎక్కడున్నా తక్షణమే వెదికి పట్టుకోవాలని.. ఎంత తొందరగా పట్టుకుంటే అంత మేలని స్పష్టం చేశారు.

వాస్తవానికి ప్రాథమిక దర్యాప్తులో ఆమె మృతదేహాన్ని 30 ముక్కలుగా నరికి ఉండొచ్చని భావించినప్పటికీ.. వైద్య పరీక్షల్లో మాత్రం ఆమె మృతదేహాన్ని సుమారు 59 ముక్కలుగా నరికినట్లు తేలీందని అన్నారు. ఆమె తలనే మూడు ముక్కలుగా పగలగొట్టాడని వైద్య నిపుణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ స్థాయిలో అతడి ప్రవర్తన గమనిస్తే... ప్రతీ శరీర భాగాన్ని నరికే సమయంలో అతడు ఆనందం పొందాడని నిపుణులు అనుమానిస్తున్నారు. సడోమా సుకిస్టిక్ లక్షణాలు ఉన్న్నవారే ఈ స్థాయిలో ప్రవర్తిస్తారని చెబుతున్నారు.

ఇక ఆమె మృతదేహం ముక్కలను విక్టోరియా ఆసుపత్రికి పంపడంతో.. వాటిని పరిశీలించిన వైద్యులు నివేదికను పోలీసులకు అందించారు. మరోపక్క దర్యాప్తు చేస్తున అధికారులు ఇప్పటికే అనేక ఆధారాలు సేకరించారని తెలుస్తోంది. ఇప్పటికే ఇన్నాళ్లు ఆమెతో సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం!

అయితే... ఈ హత్య ఒకడే చేశాడా లేక ఇద్దరు ముగ్గురి ప్రమేయం ఉందా అనే విషయంపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో అసలైన నిందితుడి కోసం పోలీసులు బృందాలు పలు రాష్ట్రాల్లో గాలిస్తున్నట్లు తెలుస్తొంది. ఇదే సమయంలో నగరంలోని పలు కీలక, అనుమానిత ప్రాంతాల్లోనూ గాలిస్తున్నారు!