Begin typing your search above and press return to search.

పోలీసుల కోసం అమర్చిన బాంబు .. !

మావోయిస్టులు పోలీసుల కోసం అమర్చిన బాంబు పేలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో తీవ్ర విషాదం నింపింది.

By:  Tupaki Desk   |   3 Jun 2024 9:49 AM GMT
పోలీసుల కోసం అమర్చిన బాంబు .. !
X

మావోయిస్టులు పోలీసుల కోసం అమర్చిన బాంబు పేలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో తీవ్ర విషాదం నింపింది. వాజేడు మండలం కొంగాల గ్రామంలో ఐదుగురు వ్యక్తులు కట్టెలు కొట్టేందుకు అడవిలోకి వెళ్లారు. రోజూ పనిలో భాగమై వారు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

ఈ క్రమంలో ఐదుగురిలో ఉన్న ఏసు బాంబు మీద కాలుపెట్టాడు. కాలు పక్కకు తీయడంతో బాంబు పేలి ఏసు ఎగిరి కొండపై పడి అక్కడికక్కడే మృతిచెందాడు. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మావోలపై పోలీసుల నిఘా, ఎన్ కౌంటర్లు పెరిగాయి. దీంతో మావోలు అడవిలోని రహదారుల్లో బాంబులు అమర్చారని తెలుస్తుంది.

ఏసు మరణించడంతో మిగిలిన నలుగురు భయంతో పరారయ్యారు. ఏసు ఇల్లందుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. బాంబు పేలిన ప్రాంతానికి వెళ్లిన పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.