Begin typing your search above and press return to search.

పుంగనూరులో మళ్లీ మొదలు... గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు!

వివరాళ్లోకి వెళ్తే... వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈ రోజు ఆ పార్టీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వచ్చారు

By:  Tupaki Desk   |   18 July 2024 9:26 AM GMT
పుంగనూరులో మళ్లీ మొదలు... గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు!
X

చిత్తురు జిల్లా పుంగనూరులో మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వాలు మారినా పుంగనూరులో పరిస్థితి మాత్రం మారడంలేనట్లుంది! ఈ సమయంలో అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరుకు వచ్చారు. దీంతో... ఒక్కసారిగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య రాళ్లదాడి జరిగింది!

ఈ దాడిలో ఇరువర్గాల్లోనూ పలువురికి గాయాలు అయ్యయాని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు గృహనిర్భందంలో ఉంచారు. దీనికంతటికీ కారణం... వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఈరోజు మిథున్ రెడ్డి రావడమే అని ఒకరంటే... ఒక పార్టీ ఎంపీ తన నియోజకవర్గంలో పర్యటించడానికి ఎవరి అనుమతి అవసరం అంటూ మరొకరు ఎదురు ప్రశ్నిస్తున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈ రోజు ఆ పార్టీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వచ్చారు. దీంతో... పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు పుంగనూరు వచ్చాడని తెలుసుకున్న వైరి వర్గం ఒక్కసారిగా రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టిందని అంటున్నారు. ఈ సమయంలో అప్పటికి అక్కడే ఉన్న వైసీపీ శ్రేణులకూ, కూటమి శ్రేణులకూ మధ్య రాళ్ల దాడి జరిగింది.. పుంగనూరు మరో సారి రచ్చ రచ్చగా మారింది!

ఈ సమయంలో పోలీసులు అలర్ట్ అయ్యారు.. వారిని చెదరగొట్టారు.. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రెడ్డప్ప ఇంటి చుట్టూ బందోబస్తు పెంచారు. ఈ సమయంలో ఆ ఇంట్లోనే ఎంపీ మిథున్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు! వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెడ్డప్ప, పెద్దిరెడ్డి తమను వేధించారంటూ టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు అక్కడికి వచ్చి ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

అనంతరం రెడ్డప్ప ఇంట్లోనే మిథున్ రెడ్డి ఉన్నాడని తెలియడంతో టీడీపీ శ్రేణులు మరోసారి దాడికి ప్రయతించాయని అంటున్నారు. ఈ క్రమంలోనే మిథున్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలో... ఆత్మరక్షణలో భాగంగా మిథున్ రెడ్డి గన్ మెన్ మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు! ఈ సమయంలో స్పందించిన టీడీపీ శ్రేణులు... తమ కార్యకర్తలను మిథున్ రెడ్డి రెచ్చగొట్టేలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.