Begin typing your search above and press return to search.

నామినేషన్ వేసిన నాగబాబు... బలపరిచింది ఎవరెవరంటే..?

ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు.

By:  Tupaki Desk   |   7 March 2025 3:57 PM IST
నామినేషన్ వేసిన నాగబాబు... బలపరిచింది ఎవరెవరంటే..?
X

ఏపీ రాజకీయాల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారిణి వనితా రాణికి నాగబాబు తన నామినేషన్ పత్రాలు సమర్పించారు.

అవును.... ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ సహా ఎమెల్యేలు కొణతాల రామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఇదే సమయంలో నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. వీరిలో.. మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, ఆరణి శ్రీనివాసులు, పంచకర్ల రమేష్ బాబు, లోకం మాధవి, సుందరపు విజయ్ కుమార్, పత్సమట్ల ధర్మరాజు, పంతం నానాజీ, బత్తుల బలరామకృష్ణులు, అరవ శ్రీధర్ ఉన్నారు.

కాగా... ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ గడువు ఈ నెల 10తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఇక మార్చి 11 ఉదయం 11 గంటలకు నామినేషన్స్ పరిశీలన కాగా.. మార్చి 13 మధ్యాహ్నం 3 గంటలల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు!