Begin typing your search above and press return to search.

దసరా స్పెషల్... పాట రాసిన ప్రధాని, గానం పూర్వా మంత్రి..!

దీనికి సంబందించిన వీడియోను నేడు తన ఎక్స్ లో షేర్ చేశారు.

By:  Tupaki Desk   |   7 Oct 2024 2:20 PM GMT
దసరా స్పెషల్... పాట రాసిన ప్రధాని,  గానం పూర్వా మంత్రి..!
X

గత ఏడాది శరన్నవరాత్రుల వేళ గర్భాపై ప్రత్యేకమైన కవితను రాసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ... ఈ సారి దసరా పర్వదినాల సందర్భంగా గర్బానృత్యంపై ప్రత్యేకమైన పాటను రాశారు. దీనికి సంబందించిన వీడియోను నేడు తన ఎక్స్ లో షేర్ చేశారు. ఈ పాటను గాయని పూర్వా మంత్రి ఆలపించారు.

అవును... దసరా సందర్భంగా ప్రధాని మోడీ.. గర్భా నృత్యంపై ప్రత్యేకమైన పాటను రాశారు. ఈ సందర్భంగా ఎక్స్ లో పోస్ట్ చేసిన ప్రధాని... ఈ పవిత్ర నవరాత్రుల్లో ప్రజలంతా ఐక్యంగా వివిధ రూపాలుగా దుర్గాదేవిని ఆరాధిస్తారని.. ఈ ప్రత్యేకమైన సమయంలో అమ్మవారి శక్తి, దయను కీర్తిస్తూ "అవటికలయ" అనే గర్బా పాటను తాను రచించినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అందరిపైనా ఆమె కృప ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్న ప్రధాని... ఈ సందర్భంగా గాయని పూర్వా మంత్రిపై మరో పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా గాయని పూర్వా మంత్రి తన అద్భుతమైన స్వరంతో ఈ పాటను ఆలపించారని పేర్కొంటూ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.

కాగా.. గత ఏడాది కూడా శరన్నవరాత్రుల వేళ గర్భాపై మోడీ ప్రత్యేకమైన కవితను రాశారు. దానికి సంబంధించిన మ్యూజిక్ వీడియో విడుదలైంది. ఈ సందర్భంగా నాడు ఎక్స్ లో స్పందించిన ప్రధాని... చాలా ఏళ్ల క్రితం దాన్ని రాసినట్లు తెలిపారు.. ఇప్పుడు ఆ గీతం వింటుంటే పాత స్మృతులు గుర్తుకువస్తున్నాయని చెప్పుకొచ్చారు.

ఆ పాటకు గాయని ధ్వని భానుశాలి ఆలపించగా.. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తనిష్క్ బాగ్చీ స్వరాలను సమకూర్చారు.