Begin typing your search above and press return to search.

నెల్లూరు జిల్లాలో దారుణం.. కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని..

కూతురు ప్రేమ వివాహం చేసుకుందని భరించలేని తల్లిదండ్రులు చాలా వరకు బిడ్డలను చంపుకున్నారు.

By:  Tupaki Desk   |   21 Sep 2024 6:54 AM GMT
నెల్లూరు జిల్లాలో దారుణం.. కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని..
X

కొంత మందికి ప్రాణాల కంటే పరువు ముఖ్యం అనే కాన్సెప్టుతో బతుకుంటారు. ఇంట్లో వారు ఎవరైనా తప్పు చేస్తే వారి ప్రాణాలు తీసైనా పరువును కాపాడుకోవాలనే చూస్తారు. కడుపున పుట్టిన బిడ్డను సైతం చంపాడానికైనా వెనక్కిపోరు. బిడ్డపై ఉన్న ప్రేమ కంటే కులం, మతం, ఆస్తి, అంతస్తులనే లెక్కల్లోకి తీసుకుంటుంటారు ఈ తరహా జనం. ఇప్పటివరకు అలాంటి హత్యలు ఎన్నో చూశాం. కూతురు ప్రేమ వివాహం చేసుకుందని భరించలేని తల్లిదండ్రులు చాలా వరకు బిడ్డలను చంపుకున్నారు.

సరిగా.. ఇలాంటి అరాచకం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగింది. కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని, తక్కువ కులం వాడిని చేసుకుందని చంపేయడాన్ని చాలా సినిమాల్లో చూశాం. కానీ.. నెల్లూరు జిల్లాలో ఓ తల్లిదండ్రులు తమ కూతురు అత్యంత దారుణంగా చంపేశారు. కేవలం ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుందన్న కారణంతో కూతురును చంపుకున్నారు.

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పద్మనాభుని సత్రానికి చెందిన దంపతులకు ఇద్దరు కూతుళ్లు. రెండో కూతురికి ఆరేళ్ల క్రితం పెళ్లి చేయగా.. పలు సమస్యలతో వారు విడిపోయారు. దాంతో అప్పటి నుంచి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది ఆ యువతి. ఈ క్రమంలో ఆమెకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. 20 రోజుల క్రితం పెళ్లి కూడా చేసుకున్నారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు కూతురిని కొట్టి.. బలవంతంగా తమ ఇంటికి తీసుకొచ్చారు.

అంతేకాదు.. కూతురు చంపేసి ఆపై శవాన్ని పూడ్చివేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రావద్దని తమ కూతురు మిస్ అయిందంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. వారి ఇంటి పరిసర ప్రాంతంలోనే ఉంటున్న ఓ వ్యక్తి వారి కూతురిని చంపి.. వారి ఇంటి సమీపంలోనే పూడ్చిపెట్టారని డయల్ 100కు ఫోన్ చేశాడు. దాంతో అసలు ఉందంతం వెలుగు చూసింది.

అనుమానం వచ్చిన పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే వారి ఇంటికి వెళ్లారు. ఇంటి పరిసరాల్లో తనిఖీ చేయగా.. అనుమానాస్పదంగా ఓ స్థలం కనిపించింది. అక్కడ వెతుకగా శ్రావణి డెడ్ బాడీ కనిపించింది. డెడ్‌ బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు మిస్సింగ్ కేసును కాస్త.. మర్డర్ కేసుగా నమోదు చేశారు.