Begin typing your search above and press return to search.

స‌నాత‌న ధ‌ర్మానికి చ‌ట్టం కావాలి: వారాహి డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఈ డిక్ల‌రేష‌న్‌ను ప్ర‌తి హిందువు పాటించాల‌ని సూచించారు.

By:  Tupaki Desk   |   3 Oct 2024 3:16 PM GMT
స‌నాత‌న ధ‌ర్మానికి చ‌ట్టం కావాలి:  వారాహి డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌
X

తిరుప‌తిలో గురువారం సాయంత్రం నిర్వ‌హించిన వారాహి బ‌హిరంగ స‌భ‌లో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. `వారాహి డిక్ల‌రేష‌న్‌` పేరుతో కొన్ని తీర్మానాల‌ను ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఈ డిక్ల‌రేష‌న్‌ను ప్ర‌తి హిందువు పాటించాల‌ని సూచించారు.

ఇవీ.. డిక్ల‌రేష‌న్‌లో కీల‌క అంశాలు

1) ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించేలా లౌకిక వాదాన్ని పాటించాలి.

2) సనాతన ధర్మ పరిరక్షణ కోసం, ఆ విశ్వాసాలకు భంగం కలుగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలు అయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం. దాన్ని తక్షణమే తీసుకురావాలి.

3) సనాతన‌ ధర్మ పరిరక్షణ కోసం తీసుకువచ్చే చట్టాన్ని అమలు చేసేందుకే జాతీయ, రాష్ట్ర స్థాయిలో ‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’ ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంది.

4) సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏటా ప్ర‌భుత్వాలు నిధులు కేటాయించాలి. దీని కోసం ప్ర‌త్యేకంగా బ‌డ్జెట్ తీసుకురావాలి.

5) సనాతన ధర్మాన్ని కించపరచి, ద్వేషం చిందించే వ్యక్తులకు, వ్యవస్థల ప‌ట్ల‌ సహాయ నిరాకరణ పాటించాలి.

6) ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలు, దీపారాధ‌న‌ల‌లో వినియోగించే స‌రుకుల స్వచ్ఛతని నిర్ధారించేలా మెరుగైన సాంకేతిక వ్య‌వ‌స్థ‌ను అమ‌లు చేయాలి.

7) ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా విల‌సిల్లాలి.

8) పర్యావరణ పరిరక్షణా కేంద్రాలుగా కూడా ఆల‌యాలు ఉండాలి. సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి. దీనికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు, ధార్మిక సంఘాలు కూడా న‌డుంబిగించాలి.