Begin typing your search above and press return to search.

మంగ‌ళ‌గిరి..పిఠాపురం ప‌ర్య‌ట‌న‌లో అన్నాలెజ్నెవా!

ఏపీలో ఎన్నిక‌లు వాడి వేడిగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఓట‌ర్లంతా త‌మ ఓటు హ‌క్కును వినియోగించు కుంటున్నారు

By:  Tupaki Desk   |   13 May 2024 6:50 AM GMT
మంగ‌ళ‌గిరి..పిఠాపురం ప‌ర్య‌ట‌న‌లో అన్నాలెజ్నెవా!
X

ఏపీలో ఎన్నిక‌లు వాడి వేడిగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఓట‌ర్లంతా త‌మ ఓటు హ‌క్కును వినియోగించు కుంటున్నారు. అలాగే సెల‌బ్రిటీలంతా విధి కూడా ఓటు వేస్తున్నారు. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజ్నెవా ఓటు వేసినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్ద‌రి ఓట్లు మంగ‌ళ‌గిరిలో ఉన్నాయి. అక్క‌డే ల‌క్ష్మీనర‌సింహ కాల‌నీకి చేరుకుని ఓటు వేసిన‌ట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో మంగళగిరిలో దిగారు.

అక్క‌డ నుంచి నేరుగా ఓటు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఇక ప‌వ‌న్ తన ట్రేడ్‌మార్క్ తెల్లటి కుర్తా మరియు పైజామా ధ‌రించారు. ఆయ‌న స‌తీమ‌ణ అన్నా లెజ్నెవా చీర ధ‌రించారు. దంపతులిద్ద‌రికీ స‌న్మానం కూడా జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇద్ద‌రు బ‌య‌ట క‌నిపించి చాలా కాల‌మ‌వుతుంది. దీంతో ప‌వ‌న్ అభిమానుల ఆనందానికి అవ‌దుల్లేవ్. అన్నా-వ‌దిన‌లు చూసుకుని అభిమానులంతా సంబ‌ర‌ప‌డుతున్నారు.

విజ‌యవాడ నుంచి నేరుగా పిఠాపురం చేరుకున్నారు. ప‌వన్ క‌ళ్యాణ్ పిఠాపురం నియోజ‌క వ‌ర్గం నుంచి పోటీ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌రుపు నుంచి మెగా ఫ్యామిలీ అంతా ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈనేపథ్యంలో అన్నాలెజ్నెవా కూడా పిఠాపురం ప‌ర్య‌టించే అవ‌కాశం ఉంటుంద‌ని అభిమానులు భావించారు. కానీ ఆమె రాలేదు. ఎన్నికలు జ‌రుగుతోన్న సంద‌ర్బంగా ఈ రోజు రావ‌డం తో అభిమానులు సంతోషిస్తున్నారు.

ఇక పిఠ‌పురం గెలుపుపై ఎవ‌రికి వారు ధీమాగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ యధావిధిగా షూటింగ్ లో పాల్గొంటారు. ముందుగా ఓజీ షూటింగ్ ని పూర్తి చేస్తారు. ఎట్టి ప‌రిస్థితుల్లో ఆచిత్రాన్ని సెప్టెంబ‌ర్ లో రిలీజ్ చేయాల‌ని భావిస్తోన్న నేప‌థ్య‌లో మేజ‌ర్ షెడ్యూల్ పూర్త‌యిన వెంట‌నే మిగ‌తా సినిమాల సంగ‌తి చూస్తారు.