Begin typing your search above and press return to search.

సంబరాల్లో అన్నా లెజినోవా, అకీరా !

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన కూటమి మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకెళ్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 Jun 2024 12:11 PM GMT
సంబరాల్లో అన్నా లెజినోవా, అకీరా !
X

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన కూటమి మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. కాగా పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి 70,354 ఓట్ల భారీ మెజారిటీతో విజయ ఢంకా మోగించడంతో అభిమానులతోపాటు జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాల్లో మునిగితేలిపోతున్నారు.

మరోవైపు జనసేన పోటీలో నిలిచిన 21 అసెంబ్లీ స్థానాలతోపాటు రెండు లోక్‌సభ స్థానాల్లో గెలుపు దిశగా ముందుకెళ్తుండటంతో జూబ్లీహిల్స్‌లోని పవన్ కల్యాణ్‌ ఇంటి వద్ద పవన్‌ కల్యాణ్‌ సతీమణి అన్నా లెజినోవా, కుమారుడు అకీరా నందన్‌ కార్యకర్తలతో కలిసి సంబురాలు జరుపుకుంటున్నారు. తాజా గెలుపుతో ఏపీలో రెండో అతిపెద్ద పార్టీగా జనసేన మారనుంది.