Begin typing your search above and press return to search.

జనసేనాని జోస్యం ఇదే !

రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ వేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

By:  Tupaki Desk   |   13 May 2024 4:32 PM GMT
జనసేనాని జోస్యం ఇదే !
X

ఏపీ ఎన్నికల్లో పిఠాపురం శాసనసభ స్థానం నుండి పోటీ చేస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ మంగళగిరిలో సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన యూపీలోని వారణాసికి పయనమయ్యారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ వేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఎన్డీయే కూటమిలో భాగస్వామి అయిన పవన్ కల్యాణ్ కు మోడీ నామినేషన్ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్, తన భార్య అన్నా లెజినోవాతో కలిసి ఈ రోజు వారణాసికి చేరుకున్నారు.

ఎయిర్ పోర్టులో పవన్ కళ్యాణ్ ను జాతీయ మీడియా పలకరించగా ‘ఎన్డీయే కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని .. తాము ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని, తమకు మంచి మెజారిటీ వస్తుందని’ పవన్ కళ్యాణ్ వెళ్లడించాడు.

ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమానికి రావడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని, ప్రధాని మోదీకి తన మద్దతు అందించి శుభకాంక్షలు తెలుపుతానని, ఆయన మూడోసారి ప్రధాని అవుతారని పవన్ అన్నాడు.