Begin typing your search above and press return to search.

దమ్ముంటే బాబు పఫ్ ల లెక్క చూపమంటున్న పేర్ని నాని

సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వైసీపీ నేతల వరుసలో ముందుంటారు మాజీ మంత్రి పేర్ని నాని

By:  Tupaki Desk   |   22 Aug 2024 4:10 AM GMT
దమ్ముంటే బాబు పఫ్ ల లెక్క చూపమంటున్న పేర్ని నాని
X

సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వైసీపీ నేతల వరుసలో ముందుంటారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎప్పటికప్పుడు.. ప్రతి చిన్న విషయానికి క్లారిటీ ఇస్తూ.. జగన్ మీద తనకున్న అభిమానాన్ని ప్రదర్శించేందుకు తెగ కష్టపడిపోతుంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్టు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. జగన్ ప్రభుత్వ హయాంలో.. ఎగ్ పఫ్ ల కోసమే రూ.3.63 కోట్ల బిల్లులు పెట్టారన్న పోస్టు ఒకటి వైరల్ గా మారింది. దీనిపై పేర్ని నాని స్పందించారు. సీరియస్ సవాలు సైతం విసిరారు.

ప్రజల బాగోగుల్ని పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం అభాండాలు వేస్తున్నట్లుగా పేర్నినాని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉండి ఉంటే.. ఎగ్ పఫ్ లెక్కలన్ని బయటపెట్టాలంటూ సవాలు విసురుతున్నారు. తప్పుడు ప్రచారంలో భాగంగానే రూ.3.63 కోట్లతో ఎగ్ పఫ్ లు తిననారంటూ తప్పుడు పోస్టులు పెడుతున్నారన్న ఆయన.. ‘‘బొద్దింకలు.. ఎలుకలు పట్టుకోవటానికి చంద్రబాబే కోట్లు చెల్లించారు. పాలించే సత్తా లేక జగన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దుష్ప్రచారం కాదు.. హామీల అమలుపై ఫోకస్ చేయాలి’’ అంటూ పేర్ని హితవు పలికారు.

జగన్ ప్రభుత్వంలో ఎగ్ పఫ్ ల కోసం అలా ఖర్చు చేసింది లేదన్న ఆయన.. జీఏడీ ఇప్పుడు చంద్రబాబు చేతిలోనే ఉందని.. ఒకవేళ నిజంగానే ఎగ్ పఫ్ లకోసం అంత ఖర్చు చేసి ఉంటే.. ఆ లెక్కల్నిచూపిస్తారా? అని ప్రశ్నించారు. టమాటా రైతులను దత్తత తీసుకుంటానని లోకేశ్ పాదయాత్రలో చెప్పారని.. ఇప్పుడా రైతులు బాధ పడుతుంటే.. లోకేశ్ ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. పరిపాలన చేయటం చేగకాక జగన్ పై పడి ఏడుస్తున్నారన్న పేర్నినాని.. ఎగ్ పఫ్ ఫైలును బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మరి.. పేర్ని నాని కోరికను చంద్రబాబు తీరుస్తారా? లేదా? అన్నది చూడాలి.