Begin typing your search above and press return to search.

పిఠాపురంలో పరిస్థితి పీక్స్ కి చేరింది... ఇదిగో ప్రూఫ్!

ఏపీలో ఈసారి జరిగినవి ఎన్నికలు కాదు.. యుద్ధం అనే స్థాయి డైలాగులు బలంగా వినిపించిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   28 May 2024 8:34 AM GMT
పిఠాపురంలో పరిస్థితి పీక్స్ కి చేరింది... ఇదిగో ప్రూఫ్!
X

ఏపీలో ఈసారి జరిగినవి ఎన్నికలు కాదు.. యుద్ధం అనే స్థాయి డైలాగులు బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇది పేదలకూ - పెత్తందారులకూ మధ్య జరుగుతున్న యుద్ధం అని వైసీపీ అంటే... ఇది జగన్ రహిత ఏపీ లక్ష్యంగా జరుగుతున్న పోరాటం అని కూటమి నేతలు కామెంట్ చేశారు.

ఇదే సమయంలో తనవల్ల మీ ఇంటికి మేలు జరిగితేనే ఓటు వేయమని జగన్ కోరితే... రాష్ట్రానికి మేలు జరగడం కోసం కూటమికి ఓటు వేయమని మూడు పార్టీల నేతలు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో నిజంగానే మే 13న ఏపీలో భారీ బేలెట్ యుద్ధమే నడిచింది. ఇక వీటికి సంబంధించిన ఫలితాలు జూన్ 4 న రాబోతున్నాయి.

మరోపక్క ఈసారి సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు.. ఏవరు అధికారంలోకి వస్తారు.. ఏపీకి రాజధానిగా ఏ ప్రాంతం ఎంపికవుతుంది అనే చర్చ అంతా ఒకెత్తు అయితే... పిఠాపురంలో పవన్ గెలుపుపై జరుగుతున్న చర్చ, వేస్తున్నారని చెబుతున్న బెట్టింగులు మరొకెత్తు అని అంటున్నారు పరిశీలకులు.

అవును... మే 13న ఏపీలో జరిగినవి ఎన్నికల పోలింగ్ కాదు.. యుద్ధం అన్నట్లుగా మారిపోతుంది రోజు రోజుకీ పరిస్థితి. ఇక ఫలితాల సంబరాలుకు జూన్ 4 వరకూ ఆగాల్సి ఉంది. ఈ గ్యాప్ లో పలు విశ్లేషణలు, అభిప్రాయాలు, అంచనాలు హల్ చల్ చేస్తున్నాయి. మరోపక్క గెలుపుపై ఎవరి ధీమాలో వారు ఉన్నారు.

ఇందులో భాగంగా జూన్ 9న విశాఖలో వైఎస్ జగన్ సీఎం గా ప్రమాణస్వీకారం ఉంటుందని వైసీపీ నేతలు ప్రకటించారు. దీంతో... ఇప్పటికే వైజాగ్ లోని హోటల్ రూమ్స్ అన్నీ అడ్వాన్స్ బుక్కింగ్ అయిపోయాయని అంటున్నారు. ఇదే సమయంలో.. పలు ప్రాంతాల నుంచి విశాఖకు వెళ్లే ఫ్లైట్, ట్రైన్, బస్ టిక్కెట్స్ కూడా అడ్వాన్స్ బుక్కింగ్ అయిపోయాయని అంటున్నారు.

వైసీపీ శ్రేణుల ధీమా ఆ రేంజ్ లో ఉంటే... పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ధీమా కూడా గట్టిగానే ఉందని చెప్పడానికి గల తాజా ఉదాహరణ తెరపైకి వచ్చింది. వాస్తవానికి ఈసారి పిఠాపురంలో గెలిచి జనసేన అధినేత పవన్ కచ్చితంగా అసెంబ్లీకి వెళ్తారని జనసైనికులు ఎంత ధీమాగా ఉన్నారో... వంగ గీత గెలిచి డిప్యూటీ సీఎం అవుతారని స్థానిక వైసీపీ శ్రేణులూ అంతే ధీమాతో ఉన్నారు.

ఈలోగా కొంతమంది అత్యుత్సాహవంతులు మాత్రం పిఠాపురంలో నేమ్ ప్లేట్లు, స్టిక్కర్లతో హల్ చల్ చేస్తున్నారు. ఇందులో భాగంగా... "పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా"... అంటూ బైక్ వెనక నెంబర్ ప్లేట్ మీద స్టిక్కరింగ్ చేయించుకున్నారు జనసైనికులు. ఈ బైక్ లు ఇప్పుడు పిఠాపురం రోడ్లపై హల్ చల్ చేస్తున్నాయి. ఒకరిని చూసి ఒకరు అన్నట్లుగా ఈ పనికి పూనుకోవడంతో.. ఇప్పుడు అక్కడ అది ట్రెండ్ గా మారింది!

మరోపక్క వంగా గీత అభిమానులు కూడా ఏమాత్రం తగ్గడం లేదు.. తగ్గేదే లేదు అంటున్నారు. వారు కూడా... "డిప్యూటీ సీఎం గారి తాలూకా"... "మా ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం"... అంటూ స్టిక్కర్లు వేయించుకుంటున్నారంట. ఇలా జన సైనికులు - వైసీపీ శ్రేణులూ పిఠాపురంలో ముందస్తు హడావిడి మొదలు పెట్టారని అంటున్నారు. దీంతో... ఫలితాల అనంతరం పరిస్థితి ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది.